టెలికం పరికరాల దిగుమతులకు సంబంధించి కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. చైనా నుండి దిగుమతి టెలికం సామాగ్రికి అడ్డుకట్ట వేసేలా తాజా నిబంధనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నమ్మకమైన వర్గాల(ట్రస్టెడ్ సోర్సెస్) నుండి మాత్రమే దేశంలోని నెట్ వర్క్ సంస్థలు తమకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికమ్యూనికేషన్ సెక్టార్(NSDTS)ని రూపొందించింది. ఈ ప్రత్యేక విధానానికి ఆమోదం లభించింది.

హువావే వంటి చైనా కంపెనీలకు చెక్ పెట్టేలా
ఈ కొత్త పాలసీ కింద కంపెనీలు దేశ భద్రతకు ప్రమాదంలేని విశ్వసనీయ కలిగిన కంపెనీల నుండి మాత్రమే టెలికం పరికరాలు దిగుమతి చేసుకోవాలి. అలాంటి కంపెనీల జాబితాను, వాటి నుంచి దిగుమతి చేసుకోదగిన పరికరాల జాబితాను ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. భారత జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. హువావే వంటి చైనా కంపెనీల టెలికం పరికరాల దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానం తీసుకువచ్చినట్లుగా భావిస్తున్నారు.

వీరు సభ్యులుగా..
కేంద్ర కేబినెట్ ఆమోదించిన నిబంధనల ప్రకారం నమ్మకమైన విక్రేతలు, పరికరాల జాబితాను డాట్ ప్రకటించనుంది. 'డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన వర్గాలు అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీగా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులు, టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటార'ని రవిశంకర ప్రసాద్ తెలిపారు.

వాటికి వర్తించదు
టెలికం కంపెనీలు తమ కొత్త సామాగ్రిని జాబితాలో ఉన్న నిర్దిష్ట విశ్వసనీయ ఉత్పత్తుల నుండే ఎంచుకోవాలి. అయితే ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని రవిశంకర ప్రసాద్ స్పష్టం చేశారు. వాటిని మార్చాల్సిన అవసరం లేదన్నారు. కాగా గత నెలలో టెలికం, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించిన సామాగ్రిని చైనా నుండి దిగుమతి చేసుకోకుండా భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications