Budget 2021: నిర్మలా సీతారామన్ ముందు సవాళ్ళు ఎన్నో
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి. కరోనా కారణంగా సాధారణ బడ్జెట్ కంటే భిన్నంగా, క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. నిర్మలమ్మ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ను ప్రవేశ పెడతామని నిర్మలమ్మ ఇటీవల చెప్పారు. దీంతో ఈ బడ్జెట్ పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు అన్ని రంగాలు, వర్గాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
రుణాలపై మారటోరియంతో పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక రంగానికి ఉన్న అవరోధాలను అధిగమించాలి. ఆరోగ్య మౌలిక వసతుల పైన దృష్టి పెట్టాల్సి ఉంది. జీడీపీలో 2.5 శాతం నుండి 3 శాతం వరకు హెల్త్ కేర్ రంగానికి నిధుల కేటాయింపులు పెరుగుతాయని ఎకనమిక్ సర్వే తెలిపింది.
భవన నిర్మాణ రంగం, పర్యాటకం, ఆతిథ్యం సహా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. పరిశ్రమలకు అవసరమైన బ్యాంకుల రుణ పరపతి తక్షణం పెంపొందించి వినియోగదారుల్లో డిమాండ్ పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో అత్యవసరంగా సంస్కరణలు తీసుకు రావాల్సి ఉంది.