లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) నేటి నుండి (నవంబర్ 27, శుక్రవారం) డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా కార్యకలాపాలు సాగించనుంది. LVB, డీబీఎస్ బ్యాంకు ఇండియాల విలీనంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రమోటర్లు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వేసిన పిటిషన్ పైన జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం విలీనంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం మరిన్ని వార్తలు

14లోపు అఫిడవిట్
అదే సమయంలో డిసెంబర్ 14న పిటిషన్లపై విచారణ జరుపుతామని, ఆ రోజు RBI, LVB, DBS బ్యాంకు ఇండయాలు తమ సమాధానాలతో కూడిన అఫిడవిట్స్ను సమర్పించాలని ధర్మాసనం సూచించింది. విలీనంపై స్టే విధించాలంటూ LVB ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారుగా ఉన్న ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పటిషన్ వేశాయి. ఇందులో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంకులను ప్రతివాదులుగా చేర్చాయి. అయితే విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ విలీనంతో రూ.188 కోట్లు నష్టపోతున్నట్లు ఇండియాబుల్స్ కోర్టుకు తెలిపింది. కానీ LVBని కాపాడే ఉద్దేశ్యంతో విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తరఫు లాయర్ తెలిపారు.

విలీనంపై ఆందోళన
LVB సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ వైఫల్యానికి సంబంధించి వివరాలు బయటకు రావాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. డీబీఎస్ బ్యాంకు ఇండియాలో విలీనం ద్వారా ఓ విదేశీ సంస్థను భారత బ్యాంకింగ్లోకి తీసుకు వచ్చారని అభిప్రాయపడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్కు ఇది విరుద్ధమని పేర్కొంది. కొంతమంది ప్రముఖులకు భారీ మొత్తాల్లో రుణాలు ఇవ్వడం వల్లే ఈ నష్టాలు సంభవించాయని అంటున్నారు. వారి రుణ చరిత్ర సక్రమంగా లేదని తెలిసి భారీ రుణాలను ఎందుకిచ్చారు, ఈ రుణాల మంజూరులో నిబంధనలను పాటించాల్సిందిగా ఆర్బీఐ ఎందుకు సూచించలేదనే అంశాలపై లోతైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నదని ఏఐబీఈఏ డిమాండ్ చేసింది.

318 కోట్ల టైర్ 2 బాండ్స్ రైటాఫ్
ఇదిలా ఉండగా, రూ.318 కోట్ల విలువైన టైర్ 2 బాండ్స్ను రైటాఫ్ చేసినట్లు LVB స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. 94 ఏళ్ల చరిత్ర కలిగిన LVB తన సుదీర్ఘ ప్రయాణంలో 90 ఏళ్ళు లాభాల బాటలో సాగింది. గత మూడేళ్లుగా నష్టాల్లో ఉంది.
విలీనానికి సంబంధించి తుది స్కీం ప్రకారం LVB పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేస్తారు. దీంతో వాటాదారులకు ఏమీ దక్కది లేదని, పెట్టుబడిని కోల్పోతామని భావించిన ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు చట్టపరమైన చర్యలపై దృష్టి సారించారు. ప్రమోటర్ గ్రూప్నకు 6.8% వాటాలు ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి LVBలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కు 4.99% ఉంది. ఇతర కంపెనీలకు కూడా వాటాలు ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications