నల్లధనాన్ని వెనక్కి తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ క్రమంగా అక్రమార్కుల నుండి నల్లధనాన్ని మాత్రం వెనక్కి తెప్పిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లు వెనక్కి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

4700 కేసుల దర్యాఫ్తు
మాల్యా, నీరవ్, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లను తిరిగి బ్యాంకులకు బదలీ చేశామని సొలిసిటర్ జనరల్ తుషారమ మెహతా భారత అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసుల్లో ఈడీ విస్తృత అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశవరి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం-PMLA కింద నమోదైన 4700 కేసులను ఈడీ దర్యాఫ్తు చేస్తోందని తెలిపారు.

మొత్తం రూ.67,000 కోట్లు
గత అయిదేళ్లుగా ప్రతి సంవత్సరం విచారణ కోసం తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కాగా, 2020-21 నాటికి 981 కేసులుగా నమోదయిందని తెలిపారు. గత అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయినట్లు తెలిపారు. చోక్సీ, మాల్యా, నీరవ్ల కేసులో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని మెహతా ధర్మాసనంకు తెలిపారు. కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న నేరాల సంఖ్య మొత్తం వ్యాల్యూ రూ.67,000 కోట్లుగా ఉందన్నారు. కానీ ఆయా కేసుల్లో కోర్టుల ఆదేశాలు రికవరీకి అడ్డంకిగా మారినట్లు తెలిపారు. కఠినమైన బెయిల్ షరతులు, అరెస్టులకు సంబంధించి సమాచార లోపం, ఈసీఐఆర్ ఇవ్వకుండా అరెస్టు చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు.

మన వద్ద తక్కువ
భారత్లో ఈడీ నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం బ్రిటన్లో PMLA కింద 7900 కేసులు, అమెరికాలో 1532 కేసులు, చైనాలో 4691 కేసులు, ఆస్ట్రియాలో 1036 కేసులు, హాంగ్కాంగ్లో 1823 కేసులు, బెల్జియంలో 1862 కేసులు, రష్యాలో 2764 కేసులు నమోదవుతున్నాయి. అయిదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులు 2086 మాత్రమే అన్నారు. కానీ వాస్తవానికి అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications