నల్లధనాన్ని వెనక్కి తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ క్రమంగా అక్రమార్కుల నుండి నల్లధనాన్ని మాత్రం వెనక్కి తెప్పిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లు వెనక్కి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

4700 కేసుల దర్యాఫ్తు
మాల్యా, నీరవ్, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లను తిరిగి బ్యాంకులకు బదలీ చేశామని సొలిసిటర్ జనరల్ తుషారమ మెహతా భారత అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసుల్లో ఈడీ విస్తృత అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశవరి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం-PMLA కింద నమోదైన 4700 కేసులను ఈడీ దర్యాఫ్తు చేస్తోందని తెలిపారు.

మొత్తం రూ.67,000 కోట్లు
గత అయిదేళ్లుగా ప్రతి సంవత్సరం విచారణ కోసం తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కాగా, 2020-21 నాటికి 981 కేసులుగా నమోదయిందని తెలిపారు. గత అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయినట్లు తెలిపారు. చోక్సీ, మాల్యా, నీరవ్ల కేసులో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని మెహతా ధర్మాసనంకు తెలిపారు. కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న నేరాల సంఖ్య మొత్తం వ్యాల్యూ రూ.67,000 కోట్లుగా ఉందన్నారు. కానీ ఆయా కేసుల్లో కోర్టుల ఆదేశాలు రికవరీకి అడ్డంకిగా మారినట్లు తెలిపారు. కఠినమైన బెయిల్ షరతులు, అరెస్టులకు సంబంధించి సమాచార లోపం, ఈసీఐఆర్ ఇవ్వకుండా అరెస్టు చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు.

మన వద్ద తక్కువ
భారత్లో ఈడీ నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం బ్రిటన్లో PMLA కింద 7900 కేసులు, అమెరికాలో 1532 కేసులు, చైనాలో 4691 కేసులు, ఆస్ట్రియాలో 1036 కేసులు, హాంగ్కాంగ్లో 1823 కేసులు, బెల్జియంలో 1862 కేసులు, రష్యాలో 2764 కేసులు నమోదవుతున్నాయి. అయిదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులు 2086 మాత్రమే అన్నారు. కానీ వాస్తవానికి అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications