గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులు 10,09,511 కోట్ల రూపాయల మొండి బకాయిలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. "బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్ను క్లీయర్ చేయడానికి, పన్ను ప్రయోజనాలను పొందేందుకు, మూలధనాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, వారి బోర్డులచే ఆమోదించిన RBI మార్గదర్శకాలు, పాలసీకి అనుగుణంగా వారి సాధారణ వ్యాయామంలో భాగంగా NPAలను రద్దు చేస్తాయి. RBI, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (SCBలు) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొత్తాన్ని రద్దు చేసింది" నిర్మలా సీతారామన్ తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్బీఐనే రూ.1,64,735 కోట్ల రుణాలు రద్దు చేసింది. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.61,763 కోట్ల రద్దుతో రెండో స్థానంలో ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.59,807 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.52,655 కోట్లు మాఫీ చేసింది.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ రూ.37,617 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.34,281 కోట్లు, ఐడీబీఐ రూ.32,586 కోట్లు, యూకో బ్యాంక్ రూ.30,160 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.22,522 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.21,772 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.18,874 కోట్ల రుణాలను రద్దు చేసిన నిర్మలా సీతారామాన్ తెలిపారు. ప్రస్తుతం, కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్చెయిన్ టెక్నాలజీని చిన్న స్థాయిలో ఉపయోగిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తెలియజేసినట్లు మంత్రి చెప్పారు.

ఎన్పీఏలు
ఎన్పీఏలకు బ్యాంకు అధికారులే కారణమని వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్ చేస్తాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి చెప్పారు. రుణాలు రైటాఫ్ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని వివరించారు.

ప్రభుత్వ బ్యాంకులు
పేదోడికి రూపాయి నమ్మని బ్యాంకులు కార్పొరేట్ సంస్థల లక్షల కోట్లు మాఫీ చేయడంపై మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రుణాలు రద్దు చేసిన బ్యాంకుల్లో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications