బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా నుండి మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కన్సార్టియంకు PMLA కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.5,646 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. రుణదాతల కన్సార్టియం ఆయన స్థిరాస్తులు, షేర్లు విక్రయించుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకుల బృందం మనీలాండరింగ్ నిరోధక(PMLA) చట్టం కోర్టును ఆశ్రయించింది.
ఈడీ స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తులను తాము విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఇందుకు ముంబై పీఎంఎల్ఏ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.5,646.54 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లను బ్యాంకులు విక్రయించుకోవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్కు ఎస్బీఐ రూ.6900 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.800 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు రూ.800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.410 కోట్ల రుణాలు ఇచ్చాయి.
]

కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఇచ్చిన రుణాల కారణంగా PSBs ఎంత మొత్తం నష్టపోయాయనే విషయం ప్రస్తుతం చెప్పడం కష్టమని PMLA కోర్టు అభిప్రాయపడింది. రూ.6,200 కోట్ల వరకు నష్టపోయామనే బ్యాంకుల వాదన ఊహాజనితం కాదని పేర్కొంది. ఈ కేసు PMLA కోర్టు విచారణ పరిధిలోకి రాదనే మాల్యా లాయర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ప్రజాధనంతో కూడిన బ్యాంకుల కేసు అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కేసుకు, మాల్యా ఇచ్చిన వ్యక్తిగత పూచీకి సంబంధం లేదన్న మాల్యా లాయర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications