ముంబై: ప్రైవేటు రంగానికి చెందిన బంధన బ్యాంక్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ఆ బ్యాంకు నెట్ ప్రాఫిట్లో 80 శాతం క్షీణత చోటు చేసుకుంది. బ్యాడ్ లోన్స్ ఈ బ్యాంక్ ఆదాయాన్ని దెబ్బతీసినట్లుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిరర్థక ఆస్తుల శాతం ప్రతి సంవత్సరం పెరిగిపోతోండటం, రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి కారణాలు బ్యాంక్ పనితీరు, ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింంచినట్లు అంచనా వేస్తోన్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 80 శాతం మేర క్షీణత కనిపించింది. ఆ బ్యాంక్కు వచ్చిన ఆదాయం 103 కోట్ల రూపాయలే.
2019-2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 517.3 కోట్ల రూపాయలు. ఏడాది తిరిగే సరికి ఈ మొత్తం 103 కోట్ల రూపాయలకు దిగజారింది. 80.1 శాతం మేర పతనాన్ని చవి చూసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కొత్తగా అయిదు లక్షల అకౌంట్లను తెరచినట్లు బంధన్ బ్యాంక్ లిమిటెడ్ యాజమాన్యం తన క్యూ4లో పేర్కొంది. ఏడాది పొడవునా 29 లక్షల కొత్త కస్టమర్లు జత అయ్యారని, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి క్లయింట్ల సంఖ్య 2.30 కోట్లకు చేరిందని తెలిపింది.

నెట్ ప్రాఫిట్లో 80 శాతం మేర క్షీణత రావడానికి కారణం హయ్యర్ ప్రొవిజన్స్ కారణమని తెలుస్తోంది. ఈ ప్రొవిజన్లు 1,594 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 827.36 కోట్ల రూపాయలే. కాగా.. బంధన్ బ్యాంక్ నెట్ ఇంటరెస్ట్లో భారీ పెరుగుదల కనిపించింది. 4.6 శాతం మేర పెరిగి 1,757 కోట్ల రూపాయలుగా రికార్డయింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 1,680 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పుడిది 1,757 కోట్ల రూపాయలకు చేరింది. నిరర్థక ఆస్తుల విలువ 3.5 శాతానికి చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఈ సంఖ్య 2.4 శాతంగా ఉండేది. చివరి త్రైమాసికంలో 87,043 కోట్ల రూపాయలను రుణాలను మంజూరు చేయగా.. ఇందులో 58,350 కోట్లు మైక్రోఫైనాన్స్కు ఇచ్చినవే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications