Mutual Fund: బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన సెబీ..
బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్గా అసెట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి తుది రిజిస్ట్రేషన్ను స్వీకరించినట్లు బజాజ్ ఫిన్సర్వ్ బుధవారం తెలిపింది. బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (BFAML) ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఉన్న బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ త్వరలో యాక్టివ్లో ఉన్న ఈక్విటీ, డెట్ హైబ్రిడ్ ఫండ్లతో సహా అనేక రకాల మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను అందించనున్నట్లు కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
భవిష్యత్తులో
సిద్ధంగా
ఉన్న
అసెట్
మేనేజ్మెంట్
కంపెనీని
నిర్మించడానికి
వివిధ
టచ్పాయింట్లు,
భౌగోళిక
ప్రాంతాలలో
పెట్టుబడిదారులకు
సేవలందించేందుకు
BFAML
టెక్-ఆధారిత,
బహుళ-ఛానల్
విధానాన్ని
రూపొందిస్తుందని
పేర్కొంది.బజాజ్
ఫిన్సర్వ్కు
సెబి
నుంచి
ఆమోదం
వ్యూహాత్మకంగా
ముఖ్యమైనదని
వివరించింది.
గణేష్
మోహన్
నాయకత్వంలో,
మా
మ్యూచువల్
ఫండ్
వ్యాపారం
పెట్టుబడి
మరియు
స్థిరమైన,
దీర్ఘకాలిక
సంపద
సృష్టికి
కొత్త
విధానాన్ని
ప్రేరేపిస్తుందని.
బజాజ్
ఫిన్సర్వ్
ఛైర్మన్,
మేనేజింగ్
డైరెక్టర్
సంజీవ్
బజాజ్
తెలిపారు.
స్టాక్ మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్పై తమ విశ్వాసాన్ని కొనసాగించే సమయంలో మరో ఏఎంసీ రాబోతుంది. AMFI నుండి తాజా డేటా ప్రకారర దేశీయ మ్యూచువల్ ఫండ్లలో జనవరి 2022లో రూ. 21.40 లక్షల కోట్లతో పోలిస్తే జనవరిలో వారి వద్ద ఉన్న ఆస్తుల విలువ 9.3 శాతం పెరిగి రూ. 23.4 లక్షల కోట్లకు చేరుకుంది. క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు ఈ అసెట్ బేస్ పెరగడం వెనుక కీలకమైన అంశంగా ఉంది.