ఆ ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకుంటే రూ.2500 వచ్చాయి

మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఏటీఎం మిషన్ నుండి రూ.500 ఉపసంహరించుకోవాలనుకంటే రూ.2500 వచ్చాయి. అంట ఏటీఎం డిస్పెన్సెస్ మిషన్ పైన మనం ఎంటర్ చేసిన దాని కంటే ఐదు రెట్ల డబ్బును ఇచ్చింది. ఈ సంఘటన నాగపూర్ జిల్లాలోని ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రయివేటు బ్యాంకులో జరిగింది. దీంతో ఆ ఏటీఎం కేంద్రానికి జనం బారులు తీరారు.

బుధవారం నాడు ఓ వ్యక్తి ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను నమోదు చేసిన రూ.500కు బదులు రూ.500 కరెన్సీ నోట్లు రూ.5 రావడంతో ఆశ్చర్యపోయాడు. అతను మరోసారి రూ.500 తీసుకొని టెస్ట్ చేశాడు. మళ్లీ రూ.2500 వచ్చాయి. ఈ వార్త స్థానికంగా అందరికీ తెలిసింది.

ATM dispenses five times extra cash in Maharashtra

దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకొని, ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. అయితే ఇక్కడ ఓ పొరపాటు జరిగినట్లుగా గుర్తించారు. చిన్న పొరపాటు ఇంత పెద్ద తలనొప్పికి కారణమైంది. రూ.100 విలువైన నోట్లను ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను పొరపాటుగా జమ చేశారు. దీంతో ఐదు రెట్లు అధికంగా వచ్చాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+