మహారాష్ట్రలోని నాగపూర్లో ఏటీఎం మిషన్ నుండి రూ.500 ఉపసంహరించుకోవాలనుకంటే రూ.2500 వచ్చాయి. అంట ఏటీఎం డిస్పెన్సెస్ మిషన్ పైన మనం ఎంటర్ చేసిన దాని కంటే ఐదు రెట్ల డబ్బును ఇచ్చింది. ఈ సంఘటన నాగపూర్ జిల్లాలోని ఖాపర్ఖేడా పట్టణంలోని ఓ ప్రయివేటు బ్యాంకులో జరిగింది. దీంతో ఆ ఏటీఎం కేంద్రానికి జనం బారులు తీరారు.
బుధవారం నాడు ఓ వ్యక్తి ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను నమోదు చేసిన రూ.500కు బదులు రూ.500 కరెన్సీ నోట్లు రూ.5 రావడంతో ఆశ్చర్యపోయాడు. అతను మరోసారి రూ.500 తీసుకొని టెస్ట్ చేశాడు. మళ్లీ రూ.2500 వచ్చాయి. ఈ వార్త స్థానికంగా అందరికీ తెలిసింది.

దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకొని, ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. అయితే ఇక్కడ ఓ పొరపాటు జరిగినట్లుగా గుర్తించారు. చిన్న పొరపాటు ఇంత పెద్ద తలనొప్పికి కారణమైంది. రూ.100 విలువైన నోట్లను ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను పొరపాటుగా జమ చేశారు. దీంతో ఐదు రెట్లు అధికంగా వచ్చాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications