ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కుదుపునకు గురైన దేశీయ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. రెండేళ్ల పాటు దాదాపుగా స్తంభించిపోయిన ఈ రంగం- క్రమంగా ఊపందుకుంది. నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కాలంలో సంభవించిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈ రంగంలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ దృష్టి సారించారు.
రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎవర్ గ్రీన్గా భావిస్తుంటాయి మార్కెట్ వర్గాలు. భూముల క్రయ విక్రయాలు, నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న ఏ రంగం కూడా దెబ్బ తినబోదనే అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నింటినీ పటాపంచలు చేసింది కరోన వైరస్. ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించడం వల్ల రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ తీవ్రంగా ప్రభావితమైంది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

ఈ కష్టకాలాన్ని అధిగమించింది రియల్ ఎస్టేట్ రంగం. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడటం మొదలయ్యాక మళ్లీ పుంజుకొంది. మునుపటి స్థితికి చేరుకుంది. అతి కొద్దిరోజుల్లోనే పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బడా కంపెనీలు మళ్లీ దీనిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. ఈ సెగ్మెంట్లో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. దశలవారీగా ఒక బిలియన్ డాలర్లను ఇందులో ఇన్వెస్ట్ చేయనుంది.
ఇందులో 750 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లోకి మళ్లించాలని అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సంస్థ భాగస్వామి నిపున్ సాహ్నీ చెప్పారు. మిగిలిన మొత్తాన్ని కమర్షియల్ డెవలప్మెంట్స్లో కేటాయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్ పాండమిక్ నుంచి దేశీయ రియాల్టీ సెగ్మెంట్ అతి వేగంగా కోలుకుందని, రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications