తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) డైరెక్టర్ పదవికి అంబానీ బ్రదర్స్లో ఒకరైన అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. అనిల్ అంబానీతోపాటు నలుగురు డైరెక్టర్లు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. బకాయిలు చెల్లించలేకే ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
మరోవైపు ఆర్కామ్ దివాలా ప్రక్రియ కూడా మొదలైంది. కంపెనీకి చెందిన ఆస్తులను ఐబీసీ నేతృత్వంలో అమ్మకానికి ఉంచగా, ఈ ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తోన్న కంపెనీల్లో అనిల్ అంబానీ సోదరుడు ముఖేశ్ అంబానీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో కూడా ఉంది.

ఇక కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వి.మణికంఠన్ గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీతోపాటు మరో నలుగురు రాజీనామాలు సమర్పించాగా, బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో కంపెనీ ఈ మేరకు పేర్కొంది. వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్కామ్ తెలిపింది.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిజానికి గత ఏడాది ఇదే త్రైమాసికానికి ఆర్కామ్ రూ.1,141 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ర్టమ్ వినియోగ చార్జీలు, లైసెన్సు ఫీజుల చెల్లింపు(ఏజీఆర్) కోసం రూ.28,314 కోట్లు కేటాయించడం వల్లే ఆర్కామ్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కంపెనీ దివాలా అంచున నిలిచింది.
దేశంలోని టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ర్టమ్ బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ ఐడియా కూడా జులై-సెప్టెంబర్ కాలానికి రూ.50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, మరో ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ కూడా రూ.23,000 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications