For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: మోడర్నా-సిప్లా వ్యాక్సీన్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్, ఈ మినహాయింపులివ్వండి..

|

అమెరికా ఔషధ సంస్థ మోడర్నా తయారు చేసిన కోవిడ్ 19 సింగిల్ డోస్ బూస్టర్‌ను భారత్‌లోకి తీసుకు వస్తామని, దానికి సత్వరం అనుమతులు ఇవ్వాలని సిప్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రధానంగా నాలుగు మినహాయింపులు కోరింది. సిప్లా-మోడర్నా జత కట్టడంపై మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా స్పందించారు.

కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించి ఇది నిజంగా అద్భుత వార్త అని, సిప్లా, మోడర్నా సంస్థలకు ప్రభుత్వం వేగంగా అనుమతులు, మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నానని, ప్రపంచంలో పలు రకాల కంపెనీల నుండి వ్యాక్సిన్‌లు రావడం శుభపరిణామమని, సిప్లా వంటి దిగ్గజ కంపెనీల సాయంతోనే కొవిడ్ మూడో దశ మాత్రమే కాకుండా భవిష్యత్‌ పరిణామాలను ఎదుర్కోగలమని ఆనంద్ మహీంద్రా అన్నారు.

 Anand Mahindra calls Cipla Moderna COVID 19 vaccine deal good news

కాగా, మోడర్నా సింగిల్ బూస్టర్‌ను భారత్‌లోకి తీసుకు రావడానికి సిప్లా కేంద్రం ముందు పలు కోరికల చిట్టా ఉంచింది. దిగుమతి సుంకాన్ని మినహాయించాలని, ఈ వ్యాక్సీన్ వల్ల ఎవరికైనా ఏదైనా నష్టం జరిగితే తమ కంపెనీకి సంబంధం లేదని, బాధితులకు నష్టపరిహారం మాత్రం ఇవ్వమని,
విదేశీ టీకాలకు భారత్‌లో ట్రయల్స్ నిర్వహించాలనే నిబంధన నుండి వెసులుబాటు కల్పించాలని కోరింది. అంతేకాదు, వ్యాక్సీన్ ధరను తామే నిర్ణయిస్తామని తెలిపింది.

English summary

గుడ్‌న్యూస్: మోడర్నా-సిప్లా వ్యాక్సీన్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్, ఈ మినహాయింపులివ్వండి.. | Anand Mahindra calls Cipla Moderna COVID 19 vaccine deal good news

Mahindra Group chairman Anand Mahindra hailed the deal between Cipla and Moderna to bring the latter's COVID-19 booster vaccine to India. Mahindra believes that a substantial supply of a variety of vaccines made around the world is "our only true defense against a third-- and all future-- waves."
Story first published: Wednesday, June 2, 2021, 15:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X