అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన పైలట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి ఘాటు లేఖ రాశారు. తమ వేతనాలు సత్వరమే బకాయిలు చెల్లించాలని, ఎలాంటి నోటీసు పీరియడ్ లేకుండా ఉద్యోగాల నుంచి ఉద్యోగాల నుంచి వైదొలిగే సదుపాయం కల్పించాలని కోరారు.

మాకు నోటీసు నిబంధనలు వద్దు
ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో 800 మంది పైలట్లు సభ్యులుగా ఉన్న ICPA ఈ ఘాటు లేఖ రాసింది. 2020 మార్చి నాటికి ప్రయివేటీకరించకుంటే మూతబడటమే శరణ్యమని పేర్కొంది. ఎయిరిండియా నుంచి వైదొలిగేందుకు తమకు నోటీసు పీరియడ్ నిబంధన పెట్టవద్దని, తాము బాండెడ్ లేబర్ కాదని తెలిపింది.

వేతన బకాయిలు చెల్లించండి.. పని చేసేందుకు సిద్ధంగా లేం
తమకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. తాము పని చేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేమని పేర్కొంది. గత రెండు మూడేళ్లుగా ఒత్తిడిలో బతుకుతున్నామని, దీని కారణంగా చాలామంది ఉద్యోగులు లోన్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

మూతపడుతుందనే ప్రకటనపై ఆందోళన
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఎయిరిండియా ప్రయివేటీకరణ జరగపోతే అప్పుడు సంస్థ మూతబడుతుందని చేసిన ప్రకటన ఆందోళనకరమని పేర్కొంది. 21 ప్రయివేటు రంగ విమానయాన సంస్థల ఉద్యోగులకు పట్టిన గతి మాకు వద్దని కోరుకుంటున్నామని తెలిపింది. మాకు ఈ ఉద్యోగాలు వద్దని, మా వేతన బకాయిలు చెల్లిస్తే మేం వెళ్లిపోతామని అంటున్నారు.
ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ప్రస్తుతం రూ.58 వేల కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. దీంతో దీనిని అమ్మేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో స్పందన లేదు. కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సంస్థలోని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications