కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో విమానాలు తిరగలేదు. ఆ సమయంలో టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకి క్యాష్ రీఫండ్ చేయాల్సి ఉంది. అయితే నగదు కొరత కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్లను అప్పుడే రీఫండ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో టిక్కెట్ క్యాన్సిలేషన్కు సంబంధించి క్రెడిట్ షెల్స్ కలిగి ఉన్నవారు ఎక్కువకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

రీఫండ్స్ సాధ్యం కాకపోవచ్చు
ప్రయాణికులకు రూ.3,000 కోట్లు విమానయాన సంస్థలు రీఫండ్ చేయాల్సి ఉంది. టిక్కెట్ క్యాన్సిల్ చేయడం ద్వారా ఆ మొత్తంతో భవిష్యత్తు తేదీలతో ప్రయాణికులు ట్రావెల్ చేయవచ్చు. ప్రయాణికులకు దాదాపు రూ.1,500 కోట్ల వరకు రీఫండ్ చేసినట్లుగా డేటా చూపిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం, ఎయిర్లైన్స్ సంస్థల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో రీఫండ్స్ పెరిగాయి. విమానరంగం ఆర్థికంగా దారుణంగా చితికిపోయిందని, దీంతో ప్రయాణీకుల రీఫండ్ మొత్తం సాధ్యం కాదని చెబుతున్నారట. అయితే ఈ డబ్బును క్రెడిట్ షేల్లో ఉంచుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితి
విమాన సంస్థల వద్ద నిధులు లేకపోవడంతో డబ్బులు రీఫండ్ చేయాలని ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితులు. ఎయిర్ లైన్స్ దారుణ నష్టాల్లో, అప్పుల్లో ఉన్నాయని చెబుతున్నారు. విమానయాన సంస్థలు, ప్రయాణికులకు నష్టం జరగకుండా పరిష్కార మార్గం ఆలోచించాలని చెబుతున్నారు.

రీఫండ్స్ నిబంధనలు
ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించిన అన్ని రీఫండ్ నిబంధనలు పాటిస్తున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. పరిశ్రమ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఇండిగో చెబుతోంది. డబ్బులు తిరిగి చెల్లించడం సులభం కాదని, కొన్ని విమాన సంస్థలు నగదు లభ్యతతో సౌకర్యవంతంగా ఉండవచ్చునని, అంతమాత్రాన డబ్బులు ఉందని కాదని, కొన్ని సంస్థలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ఖర్చులు, నష్టాలను తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ షేల్స్ ఈజీ అంటున్నారు. క్రెడిట్ షెల్స్ వినియోగం కోసం ప్రయాణికులకు నిర్దిష్ట గడువు ఉంది. దీనిని విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఉండాలంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications