ప్రభుత్వరంగ ఎయిరిండియా 100 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం వాటాల విక్రయం కోసం బిడ్స్ను ఆహ్వానిస్తోంది. 2018లో తొలిసారి 76% వాటాను విక్రయించేందుకు ప్రయత్నించిన మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు రెండోసారి మొత్తం వాటాలు విక్రయించాలని భావిస్తోంది. నాడు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో బిడ్స్ దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు.

3.26 బిలియన్ డాలర్ల రుణం
ఎయిరిండియాలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని చెబుతున్నారు. బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. క్వాలిఫై అయిన బిడ్డర్స్ను మార్చి 31న నోటిఫై చేస్తారు. బిడ్స్ వేసేవాళ్లు 3.26 బిలియన్ డాలర్లు రుణాన్ని కూడా అందచేయవలసి ఉంటుంది. ఈ కొనుగొలుకు మొదట దేశీయ సంస్తలకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. విదేశీ సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

పోటీలో ఎవరుంటారు?
సోమవారం ప్రిలిమినరీ బిడ్స్ను ఆహ్వానిస్తుండటంతో ఎయిరిండియాను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎయిరిండియా కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిరిండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్, హిందూజాలు, ఇండిగో, స్పైస్ జెట్ సహా కొన్ని ప్రయివేటు ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. కొన్ని విదేశీ సంస్థలు కూడా ఉండే అవకాశముంది.

మహారాజా మస్కట్
ఎయిరిండియా మహారాజా మస్కట్గా పేరుగాంచింది. దేశంలో, అంతర్జాతీయంగా ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ కలిగి ఉంది. మందగమనంతో పాటు ఎయిరిండియా నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ సంస్థకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్వర్క్, లండన్, దుబాయ్ వంటి చోట్ల విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రైట్స్, స్లాట్స్, సాంకేతిక సిబ్బంది ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉన్నాయి. దీంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించవచ్చునని చెబుతున్నారు.

12.7 శాతం డొమెస్టిక్ మార్కెట్
ఎయిరిండియాని 1932లో మెయిల్ క్యారియర్గా ప్రారంభించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా ప్రొవిజనల్ నెట్ లాస్ రూ.8,556.35 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఈ నష్టం రూ.5,348.18 కోట్లుగా ఉంది.
ఎయిరిండియాకు 12.7 శాతం డొమెస్టిక్ మార్కెట్ ఉంది. 2019లో ఇది 18.36 లక్షల డొమెస్టిక్ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. 2018లో 17.61 మంది ఎయిరిండియాలో ప్రయాణించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications