కరోనాపై పోరుకు బిర్లా గ్రూప్ రూ.500 కోట్ల భారీ విరాళం
కరోనా మహమ్మారిపై పోరుకు కార్పోరేట్ సంస్థలు వందలు, వేల కోట్ల విరాళాలు అందిస్తున్నాయి. శుక్రవారం ఆదిత్య బిర్లా గ్రూప్ కరోనా వైరస్పై పోరుకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో విరాళం అందించేందుకు ముందుకు వచ్చింది. పీఎం కేర్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది.
షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?
రూ.50 కోట్లను కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ-ఆదిత్య బిర్లా సీఎస్ఆర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్కులు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేస్తామని ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది. మొత్తం రూ.500 కోట్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
మరోవైపు, వేదాంత రిసోర్స్ రూ.201 కోట్లు ప్రకటించింది. ప్రభుత్వరంగ ఎరువుల తయారీ సంస్థలు రూ.32 కోట్లను అందించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రధాని సహాయ నిధికి తన లక్ష రూపాయల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.