గంగవరం విమానాశ్రయంలో అదానీ పోర్ట్స్కు 10.4 శాతం వాటాకు అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గంగవరం పోర్ట్లో 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినట్లు అదానీ పోర్ట్స్ మంగళవారం తెలిపింది. 'ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు నుండి 23 ఆగస్ట్ 2021 తేదీతో కూడిన ఆమోదపు లేఖను 24 ఆగస్ట్ 2021న అందుకున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10.4 శాతం వాటాకు ఆమోదం తెలిపింది' అని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ అప్పుడే ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ది చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.1 శాతం, విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉంది. రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. డీవీఎస్ రాజు కన్సార్టియంకు చెందిన వాటాను రూ.3604 కోట్లకు, విండీ లేక్ సైడ్ వాటాను రూ.1954 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసింది. తద్వారా పోర్టును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.

కాగా ఈ అక్వైజేషన్ పూర్తి కావడానికి నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. గంగవరం పోర్ట్ నుండి డ్రై బల్క్, బ్రేక్ బల్క్ సహా వివిధ కార్గో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గంగవరం పోర్ట్ రెవెన్యూ FY19లో రూ.964 కోట్లు కాగా, FY20లో రూ.1082 కోట్లు, FY21లో రూ.1057 కోట్లుగా నమోదయింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications