New Wage Code: వచ్చే నెల నుంచి కొత్త వేతన కోడ్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూలై 01 నుంచి వేతన కోడ్ మారితే.. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ మార్పుతో ఒకేసారి లాభనష్టాలు రెండింటినీ పొందనున్నారు. ఇంతకీ ముందుగా ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. న్యూ వేజ్ కోడ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచనుంది. అయితే ఇందులో ఉద్యోగులకు నష్టం కలిగించే అంశం కూడా ఉంది. అదేమిటంటే.. ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది.

కొత్త నిబంధన అమల్లోకి ఎప్పటి నుంచి రానుందంటే..
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. కొత్త వేజ్ జూలై 01 నుంచి అమలులోకి వస్తుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ రంగ ఉద్యోగుల బేసిక్ శాలరీ వారి మొత్తం జీతంలో కనీసం 50 శాతం ఉంటుంది. ఈ మార్పుతో ఉద్యోగులు ఇకపై తమ భవిష్య నిధికి ఎక్కువ మెుత్తం చెల్లించాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ పరంగా ఈ మార్పు మంచిదని నిపుణులు భావిస్తున్నారు. దీనితో పాటు ఉద్యోగుల కొత్త వేతన కోడ్ గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. దీని వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని వారు అంటున్నారు.

పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎలాగంటే..
ఉద్యోగి సీటీసీలోని బేసిక్ శాలరీ, HRA,రిటైర్మెంట్ బెనిఫిట్ (పీఎఫ్, గ్రాట్యుటీ), అలవెన్స్ మొదలైన అనేక భాగాలు ఉన్నాయి. ఓల్డ్ శాలరీ స్ట్రక్చర్ ప్రకారం.. అసలు జీతంలో 35 నుంచి 40 శాతం బేసిక్ శాలరీ ఆధారంగా పీఎఫ్ మెుత్తాన్ని లెక్కించి డిడక్ట్ చేసేవారు. నిబంధనల ప్రకారం.. ఉద్యోగి తన వాటా అయిన 12 శాతం చెల్లించాల్సి ఉండగా, మరో 12 శాతాన్ని కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్లో ఇవ్వాలి.
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 25,000 అయితే.. పీఎఫ్కు అతని సహకారం రూ. 3,000 అవుతుంది. కంపెనీ అదే మొత్తాన్ని (రూ. 3,000) జమ చేస్తుంది. అయితే.. యజమాని బేసిక్ శాలరీ రూ.15,000 చొప్పున నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ మెుత్తాన్ని రూ.1800 లకు పరిమితం చేసుకునేందుకు అనుమతించే మరొక నిబంధన కూడా ఉంది. కాబట్టి రానున్నకాలంలో కంపెనీలు ఈ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చని తెలుస్తోంది.

కొత్త వేతన కోడ్తో జరిగిన మార్పులు ఏమిటంటే..
వేజ్ కోడ్- 2019 నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీ CTCలో కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ జీతంలో పెరుగుదల అంటే ఇకపై నేరుగా పీఎఫ్, గ్రాట్యుటీలో సహకారం పెరుగుదల అని చెప్పుకోవాలి. మరోవైపు దీని కారణంగా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గవచ్చని తెలుస్తోంది. కొత్త వేతన కోడ్ అమలుతో పీఎఫ్ కంట్రిబ్యూషన్తో పాటు ఉద్యోగుల గ్రాట్యుటీ కూడా పెరగనుంది. ఉదాహరణకు.. మీ చివరి జీతం రూ. 50,000 ఉండి.. మీరు ఒక కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేసినట్లయితే.. మీ గ్రాట్యుటీ రూ. 1.25 లక్షలు అవుతుంది.
కొత్త విధానంలో గ్రాట్యుటీని 'డీమ్డ్' బేసిక్ జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఇది మొత్తం జీతంలో 50 శాతానికి తక్కువ ఉండకూడదు. అంటే.. మీ మొత్తం జీతం రూ. 2 లక్షలు, బేసిక్ శాలరీ రూ. 50 వేలు ఉన్నట్లయితే.. మీ గ్రాట్యుటీ రూ. లక్షగా నిర్ణయించబడుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications