అందరూ ఊహించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా చెబుతారు. ఈ వడ్డీ రేటును తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.9 శాతానికి చేరుకుంది. మే 4వ తేదీన రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో అప్పుడు 4.40 శాతానికి చేరుకుంది. ఐదు వారాల్లో 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇందుకు అనుగుణంగా రెపో రేటు ఆధారిత రుణాలను బ్యాంకులు పెంచుతాయి. అప్పుడు హోమ్ లోన్, వెహికిల్ లోన్ సహా ఇతర రుణాలు భారమవుతాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీ రేటు దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అయితే నెల రోజుల్లోనే వడ్డీ రేటు 0.9 శాతం పెరగడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు హఠాత్తుగా భారీగా పెరిగే అవకాశముంది. కాబట్టి హోమ్ లోన్స్ భారంగా మారి, డిమాండ్ స్వల్పకాలంలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్థి కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పెంపుకు అనుగుణంగా ప్రజల మైండ్ సెట్ అయ్యే వరకు డిమాండ్ తగ్గవచ్చునని అంటున్నారు.

రెపో రేటును పెంచడం వల్ల హోమ్ లోన్స్ భారంగా మారుతాయని, దీంతో స్వల్పకాలంలో ఇళ్లకు డిమాండ్ నెమ్మదిస్తుందని అంటున్నారు. వడ్డీ రేట్లు నెల రోజుల్లోనే 90 బేసిస్ పాయింట్లు పెరుగుతోందని, ఇది హోమ్ లోన్, రియాల్టీ రంగంపై ప్రభావం చూపిస్తుందని అనరాక్ చైర్మన్ అంటున్నారు. ఇటీవల వడ్డీ రేటు తక్కువగా ఉన్న సమయంలో కొనుగోళ్ళు పెరిగాయని, అయితే ఇప్పుడు నిర్మాణ వ్యయాలు పెరగడానికి తోడు, వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐ భారమవుతుందని, కాబట్టి స్వల్పకాలంలో రియాల్టీ రంగంపై ప్రభావం ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ అన్నారు. ఇతర రియాల్టీ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications