న్యూఢిల్లీ: 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అసాధ్యమని పలువురు ఆర్థిక నిపుణులు ఇప్పటికే చెప్పారు. తాజాగా, ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటుతో 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునే ప్రశ్నేలేదని చెప్పారు. ఇది సింప్లీ ఔట్ ఆఫ్ క్వశ్చన్ అని వ్యాఖ్యానించారు.

దీని ప్రకారం చేరే ప్రశ్నే లేదు
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జీడీపీ ఇటీవలి క్వార్టర్లో ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో తీవ్ర మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగరాజన్ స్పందించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 2.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని, రానున్న అయిదేళ్లలో దీనిని ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నామని, అది సాధ్యం కావాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా కనీసం తొమ్మిది శాతం ఉండాలని, ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం చూస్తే 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి చేరే ప్రశ్నే లేదన్నారు.

ఎకానమీ పుంజుకుంటుంది..
ప్రస్తుతం వృద్ధిరేటు ఆరు శాతం కంటే తక్కువగా ఉందని, వచ్చే ఏడాది 7 శాతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకుంటుందని రంగరాజన్ తెలిపారు. కానీ ఈ వృద్ధి శాతంతో అంతగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

తలసరి ఆదాయం రెండింతలు... 3600 డాలర్లు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకుంటే ఒక్కొక్కరి తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అవుతుందని రంగరాజన్ చెప్పారు. ఇప్పుడు తలసరి ఆదాయం 1800 డాలర్లుగా ఉందని, ఇది ఏకంగా 3600 డాలర్లకు చేరుకుంటుందన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే 22 ఏళ్లు
తలసరి ఆదాయం 12,000 డాలర్లుగా ఉండే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చునని, మనం ఈ స్థాయికి చేరుకోవడానికి కనీసం 22 ఏళ్లు పడుతుందని రంగరాజన్ అన్నారు. అది కూడా వృద్ధి రేటు 9 శాతంగా ఉంటే మాత్రమే అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications