'రిస్క్' నిర్ణయం, కంపెనీపై అసంతృప్తి: ఏడాదిలో 36 మంది ఔట్!
సెర్చింజన్ గూగుల్ సీఈవో సీనియర్ ఉద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట. అతని రిస్క్ అవెర్స్ లీడర్షిప్ పట్ల తీవ్ర అసంతృప్తి, విసుగు చెందిన వారు కంపెనీని వదిలి వెళ్తున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఏకంగా 36 మంది వైస్ ప్రెసిడెంట్లు గూగుల్ను వదిలి వెళ్లిపోయారని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
రిస్క్ తీసుకోకూడదన్న కంపెనీ విధానంతో అనేకమంది ఉద్యోగులు విభేదిస్తున్నట్లు తన కథనంలో పేర్కొంది. గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అపర్ణా చెన్నాప్రగడతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్పై ప్రసంశల వర్షం కురిపించారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యవక్తమవుతున్నప్పటికీ పిచాయ్ కఠిన నిర్ణయాలపై ముందుకు వెళ్లడం లేదని అంటున్నారు.
గూగుల్ సీనియర్ అధికారులలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సుందర్ పిచాయ్ కొత్త సవాల్ ఎదుర్కొంటున్నారన్నట్లు పేర్కొంది. గత ఏడాది కాలంగా గూగుల్ నుండి 30 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. గూగుల్ వైవిధ్యతతో కూడిన పరిష్కారాల వైపు ధైర్యం చేయలేకపోవడం తనకు ఉద్యోగం పట్ల ఉన్న అభిరుచిని ఆవిరి చేస్తోందని పదహారేళ్లుగా కంపెనీలో ఉన్న ఇంజినీరింగ్ మాజీ డైరెక్టర్ డేవిడ్ బేకర్ అన్నారు.