కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం పడింది. అంతోఇంతో తక్కువ ప్రభావం పడింది దాదాపు ఈ రంగం పైనే. అయినప్పటికీ చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఊరట కల్పించింది. కర్మోభూమి పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించింది. ఈ పథకం కింద ఉపాధి కోసం 37వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖమంత్రి అమిత్ తెలిపారు.

టీసీఎస్కు 20 ఎకరాలు
బెంగాల్లో ఐటీ రంగ అభివృద్ధికి సిలిగిరి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో 17 ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ద్వితీయ, తృతీయ నగరాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని సీఐఐ(కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)ను కోరామన్నారు. సిలికాన్ వ్యాలీలో 20 ఎకరాల భూమిని భారతీయ ఐటీ దిగ్గజం టీసీఎస్కు కేటాయించామన్నారు. టీసీఎస్ కార్యాలయ ఏర్పాటుతో బెంగాల్లో చాలామంది ఆశావహులకు ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.

మరో ఐదు ఐటీ పార్కులు
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారికి సహకరించేందుకు కర్మోభూమి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు అమిత్. ఇది స్కిల్డ్ ఉద్యోగుల వేదిక అన్నారు. జూన్ 8వ తేదీన దీనిని ప్రారంభించగా, 37,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 24వేల దరఖాస్తులు ప్రాసెస్ అయినట్లు తెలిపారు. చిన్న పట్టణాలు, నగరాలు గతంలో నిర్లక్ష్యం చేయబడ్డాయని, కాబట్టి సిలిగురి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి మరో ఐదు ఐటీ పార్కులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలిపారు.

టీసీఎస్, రిలయన్స్తో వేలాది ఉద్యోగాలు
టీసీఎస్కు సిలికాన్ వ్యాలీలో భూమితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 40 ఎకరాలను తీసుకున్నట్లు తెలిపారు. రిలయన్స్ జియో డేటా సెంటర్ కోసం దీనిని తీసుకున్నట్లు తెలిపారు. టీసీఎస్ బెంగాల్లో కొత్తగా 15000 ఉద్యోగాలను సృష్టించనుందని అమిత్ మిత్ర తెలిపారు. దేశంలో ఉద్యోగాల కల్పన విషయంలో ఇది టీసీఎస్ యొక్క అతిపెద్ద కేంద్రంగా ఉండనుందని చెప్పారు. మరో ఐటీ దిగ్గజం రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications