చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు కేంద్ర అధికారులు షాకిచ్చారు. భారత్ లో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కేంద్ర అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్లు అడ్డుకున్నారు. Vivo కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కో ఇండియా యూనిట్ లో తయారు చేసిన ఈ స్మార్ట్ఫోన్లను విలువను తప్పుగా ప్రకటించి ఎగుమతి చేసే ప్రయత్నం చేశారు.

రెవెన్యూ ఇంటెలిజెన్స్
ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందడంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లతో పాటు నిందితులను పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు $15 మిలియన్లు ఉంటాయని తెలిసింది. ఈ ఘటనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, వివో ఇండియా స్పందించలేదు.

పంకజ్ మొహింద్రూ
వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. "ఈ దురదృష్టకర చర్యను ఆపడానికి తక్షణ జోక్యాన్ని మేము అభ్యర్థిస్తున్నాము" అని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2 నాడు టెక్ మంత్రిత్వ శాఖలోని టాప్ బ్యూరోక్రాట్కు లేఖ రాశారు అని" బ్లూమ్బెర్గ్ కథనం వచ్చింది.

ఉద్రిక్తతలు
2020 వేసవిలో సరిహద్దు వద్ద దేశాలు ఘర్షణ పడిన తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. SAIC మోటార్ కార్ప్ లిమిటెడ్ MG మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు Xiaomi Corp స్థానిక యూనిట్లతో సహా భారతదేశంలో పనిచేస్తున్న చైనా కంపెనీలపై కేంద్రం నిఘా పెంచింది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మనీ ల్యాండరింగ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

44 ప్రాంతాల్లో దాడులు
దీంతో ఈఏడాది జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో వివో మోసాలను ఈడీ గుర్తించింది. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వివో ఫోన్లను ఇతర దేశాలకు తరలించడం గమనార్హం. Vivo తన మొదటి బ్యాచ్ ఇండియా-మేడ్ స్మార్ట్ఫోన్లను నవంబర్ ప్రారంభంలో సౌదీ అరేబియా, థాయిలాండ్ వంటి మార్కెట్లకు ఎగుమతి చేసింది. అయితే తాజా స్నాగ్ ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్లో Vivo భవిష్యత్తును ప్రశ్నర్థకం చేసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications