న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ BSNLలో తీసుకువచ్చిన వీఆర్ఎస్ పథకానికి ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా 22,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. నవంబర్ 5వ తేదీన ప్రారంభమైన పథకానికి డిసెంబర్ 3వ తేదీ వరకు తుది గడువు ఉంది. దాదాపు 80,000 మంది వరకు వీఆర్ఎస్ పథకం ఎంచుకుంటారని అంచనా. అయితే రెండు రోజుల్లోనే 22వేల మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13,000 మంది గ్రూప్ సీ కేటగిరీకి చెందినవారున్నారు.
ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా భారత్ సంచార్ నిగమ్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (AIBSNEA) తాజాగా కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు ఓ లేఖ రాసింది. పే రివిజన్ డిమాండ్ చేసింది. 2017 జనవరి నుంచి పే రివిజన్ అమల్లోకి రావాలని, ఆ తర్వాతే వీఆర్ఎస్ అని డిమాండ్ చేస్తున్నారట.

VRS స్కీం ఇటీవల ప్రారంభమైంది. ఈ స్కీంకు 1 లక్షమందికి వరకు ఎలిజిబుల్ కాగా, 70వేల నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గి, రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల వ్యయ భారం తగ్గే అవకాశముందని BSNL అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 1.50 లక్షల మంది నుంచి 1.75 లక్షలమంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 50 ఏళ్లు దాటిన వారు లక్ష వరకు ఉంటారని అంచనా.
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు VRS కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ఫీల్డ్ యూనిట్లకు అందించామని, వారు ఉద్యోగులందరికీ ఈ వివరాలు చెబుతారని అన్నారు. వీఆర్ఎస్ ఆఫర్ వివరాలు వారి నుంచి తెలుసుకోవచ్చునని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications