న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండో క్వార్టర్లో భారీ లాభాలు నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ఏకీకృత నికర లాభం రూ.3,375.40 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.576.46 కోట్లు నమోదుతో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు కావడం గమనార్హం. స్టాండ్ లోన్ ప్రాతిపదికన చూస్తే మూడు రెట్ల నికర లాభం పెరిగింది. గత ఏడాది జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.944.87 లాభం నమోదు చేయగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.3011.87 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
సమీక్షా త్రైమాసికంలో ఎస్బీఐ గ్రూప్ రూ.89,347.91 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.79,302.72 కోట్లుగా ఉంది. ఎన్పీఏలు కూడా తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంలో 9.95శాతం ఉండగా, ఇప్పుడు 7.19 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి తగ్గాయి. క్వార్టర్లీ ప్రాతిపదికన తాజా స్లిప్పేజెస్ రూ.16,000 కోట్ల నుంచి రూ.8,800కు తగ్గాయి.

ఎస్బీఐ నికర వడ్డీ రేటు (NII) ఈ క్వార్టర్లో రూ.24,600 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.20,906 కోట్లుగా నమోదయింది. పెరుగుదల 17.67 శాతంగా ఉంది. ఎస్బీఐ ఆపరేటింగ్ ప్రాఫిట్ 31 శాతం పెరుగుదలతో రూ.13,905 నుంచి రూ.18,199కు పెరిగింది. డొమెస్టిక్ క్రెడిట్ గ్రోత్ 8.43 శాతం పెరిగింది.
SBI భారీ లాభాల నేపథ్యంలో శుక్రవారం (అక్టోబర్ 25) షేర్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి ఓ దశలో షేర్ విలువ 8 శాతానికి కూడా పెరిగింది. మధ్యాహ్నం గం.3.30 సమయానికి 19.85 (7.56%) పెరిగి 282.35 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications