రూ.4,025 కోట్ల భూషణ్ స్టీల్ ఆస్తులు జఫ్తు

ఢిల్లీ: బ్యాంకు ఫ్రాడ్ కేసులో భూషణ్ పవర్ అండ్ స్టీల్ (BPSL)కు చెందిన రూ.4,025 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ఏ నిబంధనల కింద కంపెనీకి ఒడిశాలో ఉన్న ప్లాంటుకు చెందిన భూమి, బిల్డింగ్స్, యంత్ర సామాగ్రిని శనివారం అటాచ్ చేసింది. ఈ కేసులో ఇది తొలి అటాచ్‌మెంట్. మరిన్ని అటాచ్‌మెంట్స్ జరుగుతాయని భావిస్తున్నారు.

పలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను BPSL వివిధ మార్గాల్లో మళ్లించినట్లు ఈడీ తెలిపింది. శనివారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భూమి, బిల్డింగ్, ఒడిశాలోని ప్లాంట్, అందులోని యంత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,025.23 కోట్లు.

ED attaches Bhushan steels assets worth Rs.4025 crore

మరోవైపు, BPSL కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దాఖలు చేసిన బిడ్‌ను ఆలస్యం కాకుండా ఆమోదించాలని రుణదాతలు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (NCLAT)ను కోరారు. రూ.19,350 కోట్లతో BPSLను కొనుగోలు చేస్తామని జేఎస్‌డబ్ల్యూ ముందుకు వచ్చింది. మరో రూ.350 కోట్లను నిర్వహణ రుణదాతలకు ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌కు గత నెల 5న NCLAT ఓకే చెప్పింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+