అమరావతి: ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీలు అప్పులు తీసుకుంటే బ్యాంకులు వారి చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. వారి రాబడి, ఖర్చులు.. ఇలా అన్నింటినీ లెక్కవేస్తాయి. మనకు గ్యారంటీ ఉన్న వారి గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటారు. ఆ తర్వాతే మనకు అప్పు ఇస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థకు వచ్చింది. ప్రభుత్వరంగ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ (APPFCL)కు ప్రస్తుతం అప్పు దొరకడం కష్టంగా మారిందట. మరో విషయం ఏమంటే రుణానికి గ్యారెంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్పును ఎలా తీరుస్తారని సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పీపీఏల దెబ్బ
గత తెలుగుదేశం పార్టీ హయాంలో పీపీఏలను సమీక్షిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సహా పలు సంస్థలు తప్పుబట్టాయి. పీపీఏల సమీక్ష, రద్దు ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని కూడా హెచ్చరించాయి.

పాత ప్రభుత్వాల హామీలు గౌరవించడం లేదు..
ఈ నేపథ్యంలో ఇప్పుడు రుణ సేకరణకు ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించడం లేదని, రుణ మంజూరు విషయంలో దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసిందట. చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏ ఒప్పందాల సమీక్ష దెబ్బ ఇలా పడిందని అంటున్నారు.

అసలు మీకు అప్పు తీర్చే శక్తి ఉందా?
మీకు అప్పు ఇస్తే తీర్చగలిగే శక్తి ఉందా, అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు, ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏదైనా ఆదాయం ఉందా అంటూ APPFCLను ప్రశ్నించిందట. గత ప్రభుత్వాలు ఇచ్చే హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, దీనిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో పాటు తమ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని APPFCL మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాసిందట.

ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3 లక్షల కోట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.52 లక్షలు ఉన్నాయని, 2020 నాటికి అవి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయని బ్రిక్ వర్క్ సంస్థ నివేదిక తెలిపిందని, ఏపీపీఎఫ్సీఎల్ ఈ లేఖలో ఎస్బీఐ పేర్కొందట. 2016-17 ఆర్థిక సంవత్సరంలో APPFCL సంస్థ ఏపీ ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు రూ.9,665 కోట్లు అని, 2017-18 నాటికి అవి రూ.35,964 కోట్లకు పెరిగాయని బ్రిక్ వర్క్ నివేదిక సూచించింది.

రుణభారం అధికమవుతుందనే...
ఇప్పుడు APPFCL ప్రతిపాదించిన రూ.3 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల రుణభారం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో రుణం తిరిగి చెల్లింపు, చెల్లింపులు జరిపేందుకు గల ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి ఉందని బ్యాంకు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమ ప్రశ్నలకు సమాధానం పంపిస్తే వాటిని తాము కార్పోరేట్ కార్యాలయానికి పంపిస్తామని తెలిపింది.
More From GoodReturns

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications