కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో సహా కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపనలు ప్రకటించిన అనంతరం మార్కెట్లు జోరందుకున్నాయి. గత కొంతకాలంగా ఐపీవోపై వెనక్కి తగ్గిన కంపెనీలు ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఐపీవోకు వచ్చే కంపెనీలకు భారీ మార్కెట్ విలువ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ఆలోచిస్తోంది.
తాజాగా ఐఆర్సీటీసీని ప్రభుత్వం ఐపీవోకు తీసుకు వచ్చింది. మెరుగైన లాభాలు, నగదు నిల్వలు చూపించే కంపెనీలకు ఐపీవోలో భారీ డిమాండ్ సహజం. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
పలు కంపెనీల్లో వాటాల విక్రయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యదర్శుల బృందం సోమవారం కొన్ని కంపెనీల్లో వాటాల వ్యూహాత్మక విక్రయానికి క్లియరెన్స్ ఇచ్చింది. వీటిలో ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ((BPCL), బీఈఎంఎల్, కంటెయినర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (Concor), BEML, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SCI), THDC India, Neepco, NTPC కంపెనీలు ఉన్నాయి.

ఎయిరిండియాపై రూ.30వేల కోట్ల రుణభారం ఉంది. ప్రస్తుతం సానుకూల ధోరణి ఉన్నందున ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన పేపర్ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ప్రకటన వెలువడవచ్చు.
BPCLలో ప్రభుత్వం వాటా 55,000 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా, ప్రభుత్వం రూ.65,000 కోట్లుగా ఉందని భావిస్తోంది. ప్రభుత్వం వాటా 53.3 శాతంగా ఉందని, కాబట్టి ఈ వాటాల విక్రయానికి పార్లమెంట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
BEMLలో ప్రభుత్వానికి 54 శాతం వాటా ఉంది. దీని విలువ రూ.2,100 కోట్ల వరకు ఉండవచ్చు. కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 54.8 శాతం ఉండగా రూ.20 వేల కోట్ల వ్యాల్యూ ఉంటుందని అంచనా. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 73.75 శాతం వాటా విలువ రూ.1300 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షేర్లను విక్రయించి భారీగా నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు సాగితే దీపావళి నాటికి మార్కెట్లో ప్రభుత్వరంగ కంపెనీలు వాటాల విక్రయంతో సందడి చేయవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?



Click it and Unblock the Notifications