అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వీటిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు జరిగిన పదిరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
ఈ పరీక్షకు మొత్తం పంతొమ్మిదిన్నర లక్షల మందికి పైగా హాజరయ్యారు. నియామక పరీక్షల్లో 1,98,184 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ కేటగిరీలో 24,583 మంది, బీసీ కేటగిరీలో 1,00,494 మంది, ఎస్సీ కేటగిరీలో 63,629, ఎస్టీ కేటగిరీలో 9,458 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,28,728 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం 21.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రెండు లక్షల మంది పరీక్షలకు హాజరు కాలేదు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరుతారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది. నెలకు రూ.15వేలు ఇస్తారు.
లక్షలాది మంది ఫలితాలు చూసుకునేందుకు వెబ్ సైట్స్ ఓపెన్ చేయగా ఏపీ గ్రామ సచివాలయ వెబ్ సైట్ మొరాయించింది. అభ్యర్థులు ఫలితాలు చూసుకునేందుకు నిరీక్షించవలసి వచ్చింది. ఫలితాలు ఈ వెబ్ సైట్లలో చూసుకోవచ్చు....
http://gramasachivalayam.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications