కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆటో సేల్స్, మిలీనియల్స్, ఓలా-ఉబెర్ క్యాబ్లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆటో సేల్స్ తగ్గడానికి మిలీనియల్స్ ఆలోచనా ధోరణి మారడం, క్యాబ్స్ ఉపయోగించడం కూడా ఓ కారణమని ఆమె చెప్పారు. అయితే ఈ సేల్స్ తగ్గడానికి ఇదొక్కటే కారణం కాదని ఇండస్ట్రీ వర్గాలు, నిపుణులు అంటున్నారు. లెక్కలు కూడా అందుకు భిన్నంగానే ఉన్నాయని చెబుతున్నారు.

అగ్రిగేటర్స్కూ విక్రయాలు తగ్గాయి
అన్ని క్యాబ్ అగ్రిగేటర్లకు పాసింజర్ వెహికిల్ సేల్స్ 8-10 శాతం మధ్య ఉన్నాయి. భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ కంపెనీ ట్యాక్సీ విభాగానికి చెందిన అమ్మకాలు 5-6 శాతం మధ్య ఉన్నాయి. గత ఏడాది కూడా ఇందులో మార్పు లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆటో సేల్స్ తగ్గుదలకు అనుగుణంగా క్యాబ్ అగ్రిగేటర్స్కు కూడా అదే స్థాయిలో విక్రయాలు తగ్గాయి. హ్యుండాయ్ క్యాబ్ అగ్రిగేటర్ సేల్ 3 శాతంగా ఉంది.

పాసింజర్ వెహికిల్ సేల్స్
ఈ ఆర్థిక సంవత్సరంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ దాదాపు పావు శాతం తగ్గాయి. ఆటో సేల్స్ వరుసగా పదో నెల కూడా తగ్గాయి. గత 14 నెలల్లో మొత్తంగా 13 నెలలు సేల్స్ తగ్గాయి. ఆటో పరిశ్రమ భారీ మందగమనంలో ఉండటంతో పది శాతం జీఎస్టీని తగ్గించాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది.

క్యాబ్స్, రేడియో ట్యాక్సీలు పెరగాలి...
నిర్మల సీతారామన్ చెప్పిన దాని ప్రకారం క్యాబ్స్, రేడియో ట్యాక్సీలు ఎక్కువగా పెరిగాలి. ఉదాహరణకు ఓలాను తీసుకుంటే 8,50,000 కార్లు, మరో 50,000 లీజ్ మోడల్లో ఉన్నాయి. ఈ సంఖ్య వరుసగా 15,00,000, లక్షకు పెరిగాయి. అంటే రోడ్డు పైకి వచ్చిన కొత్త క్యాబ్స్ మరో లక్షలకొద్ది ఉన్నట్లు. అయితే ఇవన్నీ కొత్తవి అని చెప్పలేం. ఎందుకంటే ఇందులో చాలామొత్తం ప్రీ-ఓన్డ్ కార్లు మాత్రమే కాకుండా రెండు ప్లాట్ ఫామ్స్లలో రిజిస్టర్ అయి ఉండే అవకాశముంది.

ఓలా, ఉబెర్ కారణమని చెప్పలేం
ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసుల వల్లే ఆటో సేల్స్ చెప్పలేమని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ శ్రీవాత్సవ చెప్పారు. వీటి ప్రభావ అంతగా లేదని, అయితే భవిష్యత్తులో ఈ ప్రమాదం ఉండవచ్చునని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు.

ఓలా, ఉబెర్ వ్యాపారంపై ప్రభావితం..
మరో ఆసక్తికర విషయం ఏమంటే ఈ మందగమనం ఈ సంవత్సరం ఓలా, ఉబెర్ వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది. రోజువారీ రైడర్షిప్స్లో అగ్రిగేటర్స్ వృద్ధి 2016లో 80 శాతానికి పైగా ఉంటే, 2019లో ఇది 4.5 శాతం తగ్గింది. ఓలా, ఉబెర్ సంస్థలు 2018లో ప్రతి రోజు 3.5 మిలియన్ ట్రిప్పులు నిర్వహించగా, ఇప్పుడు 3.65 మిలియన్ ట్రిప్పులు మాత్రమే ఉంది.

సొంత కారు వర్సెస్ క్యాబ్
ఇక, కారుపై చేసే ఖర్చును లెక్కలోకి తీసుకున్నప్పటికీ కేంద్ర ఆర్థికమంత్రి లెక్కలు సరికావని అంటున్నారు. నిర్వహణ ఖర్చు, ఓనర్షిప్, మైలేజ్, డ్రైవర్ వేతనం తీసుకుంటే ప్రతి రోజు 20 కిలోమీటర్ల ప్రయాణానికి పర్సనల్ కారుకు రూ.740 ఖర్చు అవుతుంది.
నెరవారీగా చూస్తే క్యాబ్స్కు రూ.13,500 ఖర్చు కాగా, పర్సనల్ కారుకు రూ.18,160 అవుతుంది. పీక్ హవర్స్లో క్యాబ్ ట్రిప్ 25 శాతం పెరిగితే అప్పుడు ఈ మొత్తం రూ.16,875 అవుతుంది. ఈ లెక్కన క్యాబ్ కంటే కారును సొంతం చేసుకోవడానికే ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి.
అదే సమయంలో ఎవరైనా రోజుకు 100 కిలో మీటర్లు లేదా నెలకు 2500 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే క్యాబ్ బిల్ రూ.44,000 అవుతుంది. పీక్ హవర్స్ అయితే రూ.55,000 వరకు కూడా అవుతుంది. అదే సమయంలో సొంత వెహికిల్ అయితే కేవలం రూ.26,802 అవుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications