ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించడం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థ చట్టాన్ని ఉల్లంఘించేవారి మధ్య వివక్షను చూపించదని చెప్పారు. ఎవరైనా చట్టానికి లోబడి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని పక్షంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అధిక జరిమానా సరైనదేనని అభిప్రాయపడ్డారు.
కొత్త మోటార్ వాహన చట్టం భారీ జరిమానాలను సూచిస్తోంది. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. బైక్స్ నుంచి ట్రక్కుల వరకు వేలాది రూపాయల జరిమానాలు చెల్లించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటివి ప్రమాదాలకు కారణమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.

'ఒకరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తే చలాన్లకు భయపడాల్సిన పని లేదు. నిబంధనలు పాటిస్తే భయపడటం ఎందుకు? ఇలాంటి కఠిన నిబంధనల వల్ల భారతదేశ రోడ్లు కూడా విదేశాల్లోని సురక్షిత రహదారుల వలె సురక్షితంగా మారుతాయని ప్రజలు సంతోషించాలి. మనిషి జీవితం విలువైనది కాదా (ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతుండటాన్ని ఉద్దేశించి)' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను చాలా ఈజీగా తీసుకుంటున్నారని, దీంతో ప్రమాదాలకు కారణం అవుతోందని, కాబట్టి నిబంధనలు కఠినతరం చేసినట్లు గడ్కరీ చెప్పారు. తక్కువ ఫైన్స్ ఉన్నందువల్ల చట్టం పట్ల భయం, గౌరవం లేకుండా పోయాయాన్నారు.
'ఇది చాలా సున్నతమైన సమస్య. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అడగండి. 65 శాతం ప్రమాద బాధితులు 18-35 ఏళ్ల మధ్య వయస్సుగలవారే. వారి కుటుంబాలను అడగండి ఈ చలాన్ల గురించి. నేను కూడా ప్రమాద బాధితుడినే. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్, టీడీఆర్ఎస్ వంటి అన్ని పార్టీలు ఆలోచించాల్సిన విషయం' అన్నారు.
కొత్త వాహన చట్టం ఎవరి పట్ల వివక్ష చూపించదన్నారు. జర్నలిస్ట్ అయినా, బ్యూరోక్రాట్ అయినా జరిమానా చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రులు, వంటి ప్రముఖులు కూడా చలాన్లు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఎలక్ట్రానిక్ ఫామ్లోని డిజిలాకర్, ఎంపరివాహన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను ట్రాఫిక్ పోలీసులకు చూపించవచ్చునన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications