కార్డ్-లెస్ క్యాష్ విత్డ్రాల్స్ దిశగా బ్యాంకులు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో ద్వారా ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ఇప్పుడు మరో ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా క్యాష్-లెస్ విత్ డ్రాల్స్ దిశగా అడుగు వేస్తోంది. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కోడ్ ఆధారంగా నగదు ఉపసంహరణకు వీలు కల్పించే ఏటీఎంలను శనివారం ప్రారంభిస్తున్నట్లు BOI వెల్లడించింది.

ముంబై, చెన్నై, ఢిల్లీల్లో ప్రారంభం...
ముంబై, చెన్నై, ఢిల్లీలలో వీటిని ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ కొత్త సేవల కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో అన్ని ఏటీఎం కేంద్రాలకు ఈ సదుపాయాలను విస్తరింపజేస్తామని పేర్కొంది. ఈ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ సిస్టంను ఇతర బ్యాంకుల ఏటీఎంలకు కూడా విస్తరించవచ్చునని చెబుతున్నారు.

క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేసి..
ఏటీఎం తెర పైన కనిపించే క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేయడం ద్వారా నగదును విత్ డ్రా చేయవచ్చునని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. డెబిట్ కార్డు ద్వారా అయితే ఓసారి రూ.10,000 చేయవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఒక్కోసారి రూ.2,000 మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

కార్డు, పిన్ అవసరం లేదు..
కస్టమర్లు ఏటీఎం సెంటర్కు వెళ్లి తమ మొబైల్ ఫోన్లో గల బ్యాంకు UPI ప్లాట్ ఫామ్ను వినియోగించి ఏటీఎం స్క్రీన్ పైన గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదును తీసుకోవచ్చునని, క్యూఆర్ కోడ్తో ఏటీఎం లావాదేవీల వల్ల భద్రత మరింతగా పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించినప్పుడు కార్డు, పిన్ అవసరం ఉండదని తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications