కుమార మంగళం బిర్లా కు చెందిన .... ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్ (అబీసీఎల్) లోకి భారీ పెట్టుబడి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అడ్వెంట్ ఈ మేరకు ఆసక్తి చూపుతోంది. సుమారు రూ 1,200 కోట్ల నుంచి రూ 1,300 కోట్ల మేరకు పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనిపై కుమార మంగళం బిర్లా తో ముమ్మర చర్చలు జరిపింది. ఈ పెట్టుబడితో ఆదిత్య బిర్లా కాపిటల్ లో 6-7% వాటా ను అడ్వెంట్ ఆశిస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. ఆదిత్య బిర్లా కాపిటల్ ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ ఐన కంపెనీ. ఇది ఆర్థిక సేవలను అందించే హోల్డింగ్ కంపెనీ.

రూ 3,500 కోట్ల సమీకరణ...
ఆదిత్య బిర్లా కాపిటల్ మొత్తంగా రూ 3,500 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోంది. ఇందుకోసం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ) సహా వివిధ మార్గాలను ఎంపిక చేసుకోంది. ఇందులో భాగంగా ఈ నెల 5న కంపెనీ బోర్డు మీటింగును నిర్వహించనుంది. ఈ మీటింగ్లో అమెరికా కంపెనీ అడ్వెంట్ పెట్టుబడి అంశాన్ని పరిశీలించి అనుమతించే అవకాశం ఉంది. ఈ డీల్ పూర్తయితే, ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్ లో ప్రోమోటర్ల తర్వాత అడ్వెంట్ కంపెనేయే అతిపెద్ద ష్రెహోల్డర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అజీమ్ ప్రేమజీ పెట్టుబడులు...
కుమార మంగళం బిర్లా కంపెనీ ఐన ఆదిత్య బిర్లా కాపిటల్ లో విప్రో అధిపతి అజీమ్ ప్రేమజీ కూడా పెట్టుబడి పెట్టారు. 2017 జులై లో అయన తన పెట్టుబడి సంస్థ అయిన ప్రేమజీ ఇన్వెస్ట్ ద్వారా రూ 704 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీంతో ఆయనకు ఆదిత్య బిర్లా కాపిటల్ లో 2.2% వాటా లభించింది. అప్పుడు ఆదిత్య బిర్లా కాపిటల్ విలువను రూ 32,000 కోట్లుగా లెక్క కట్టారు. 2017 లోనే ఆర్థిక సేవలను విభజించి ఆదిత్య బిర్లా కాపిటల్ గా ఏర్పాటు చేసారు. అదే సమయం లో ఆదిత్య బిర్లా నువో అనే సంస్థను గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో కలిపేశారు.

65% పతనమైన షేర్లు...
ఆర్థిక సేవలను అందించే ఆదిత్య బిర్లా కాపిటల్ లిమిటెడ్.... స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 65% విలువను కోల్పోయింది. ఈ కంపెనీ షేర్లు ఆ మేరకు పతనమయ్యాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ 19,309 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత డీల్ ప్రకారం అడ్వెంట్ కంపెనీకి ప్రస్తుత మార్కెట్ రేటు కంటే కేవలం 5-6% ప్రీమియం కె షేర్ల ను కేటాయించే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అడ్వెంట్ కు బోర్డు సీటు...
ఒక రకంగా చెప్పాలంటే అడ్వెంట్ కు కారు చౌకగా ఆదిత్య బిర్లా కాపిటల్ షేర్లు లభిస్తున్నట్లే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేవలం 6-7% వాటా అయినప్పటికీ అడ్వెంట్ బోర్డు సీట్ ను అడిగే ఛాన్స్ ఉందని... ఇందులో ఆదిత్య బిర్లా కాపిటల్ యాజమాన్యం సరేనందని సమాచారం. కాగా... అడ్వెంట్ కంపెనీ ఇప్పటి వరకు భారత్ లో రూ 6,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఆర్థిక సేవలు అందించే పెద్ద కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేస్తూ దూసుకు పోతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications