దేశంలో పెద్ద ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఊహించని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడిదారులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే ఇదే సమయంలో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశ నగదు కొరత ఎదుర్కొంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వ్యవస్థల నమ్మకం లోపించడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని పేర్కొనడం జరిగింది.
అయితే బ్యాంకులకు నగదు కొరత లేదని ఎస్బిఐ బ్యాంక్ చైర్మన్ రజనీష్ పేర్కొన్నారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎస్బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ పరిస్థితి పై మాట్లాడుతూ నెలకు లక్ష కోట్ల వరకు అప్పు ఇచ్చే స్థాయిలో ఎస్బిఐ ఉందని పేర్కొన్నారు. ఒక ఎస్బిఐ మాత్రమే కాదు చాలా బ్యాంకులలో ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు .బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల ఆర్థిక మందగమనం అన్నదానిపై ఆయన పై విధంగా స్పందించారు. బ్యాంకులు ఎప్పుడు రుణాలు ఇవ్వడానికి వెనక్కి పోవడం లేదని పేర్కొన్నారు. ఇక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ నే ప్రశ్నించడంటూ సమాధానం చెప్పారు.

అంతేకాదు ప్రస్తుతం అప్పులు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, అయితే పెద్ద ప్రాజెక్టు మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఉన్నాయని ఆయన తెలిపారు బ్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు వచ్చాయని, కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. అలాగే కంపెనీలు కూడా అప్పులు తగ్గించుకొని జాగ్రత్తగా కంపెనీల నిర్వహణ చేయాలని సూచించారు .ఒకవేళ కంపెనీలు అప్పులు తగ్గించుకుంటే కార్పొరేట్ రంగానికి వెళ్లే క్రెడిట్ తాము ఊహించనంత ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications