న్యూఢిల్లీ: బ్యాంకుల లోన్ రికవరీలు రికార్డ్ హైకి చేరుకున్నాయనికేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. లోన్ రికవరీ 2018లో రూ.77,000 కోట్లుగా ఉండగా, అది రూ.1,71,676 కోట్లకు పెరిగిందని చెప్పారు. గ్రాస్ ఎన్పీఏలు 7.9 లక్షల కోట్లకు తగ్గినట్లు తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు అందకుముందు రూ.8.65 క్షల కోట్లుగా ఉన్నాయని, ఇప్పుడు భారీగా తగ్గాయన్నారు. ఈ రోజు ప్రకటిస్తున్న అంశాలు మార్కెట్లో రుణాలను పెంచే లక్ష్యంతో ఉంటాయని బ్యాంకుల విలీనాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. NBFCలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామన్నారు. పెండింగులో ఉన్న జీఎస్టీ రీఫండ్స్ను రానున్న ముప్పై రోజుల్లో క్లియర్ చేస్తామని, భవిష్యత్తులో అరవై రోజుల్లో రీఫండ్స్ను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రం త్వరలో రెండు కీలక నిర్ణయాలు తీసుకోనుందన్నారు.

నిర్మలా సీతారామన్ శుక్రవారం వివిధ బ్యాంకుల విలీనంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలను చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడనున్నట్లు తెలిపారు.
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును కలిపి అయిదే అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications