JLL ఆదాయం రూ.4,000 కోట్లు, వచ్చే ఏడాది చివరికల్లా 2,000 మందికి ఉద్యోగ అవకాశం
ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా రాబడి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం పెరిగి, రూ.4 వేల కోట్లకు చేరుకుంది. ఓ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లోడౌన్ అయినప్పటికీ జేఎల్ఎల్ మాత్రం మంచి వృద్ధి సాధించింది. అదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 2,000 మందిని ఉద్యోగంలోకి తీసుకోనుంది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్కు చెందిన సంస్థనే జేఎల్ఎల్ ఇండియా.
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,420 కోట్ల రెవెన్యూను రిపోర్ట్ చేసింది. దేశంలోని 10 మెజర్ సిటీల్లో ఈ కంపెనీకి ఉన్న వివిధ కార్యాలయాల్లో 11,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి మరో 2,000 మందిని తీసుకోనుంది.
నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!
ఇండియన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డిమాండ్ బాగా ఉందని, ఇది వృద్ధి రేటుకు ఉపయోగపడిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ నాయర్ అన్నారు. ఆఫీస్ స్పేస్ వంటి వాటికి ఇన్వెస్టర్లు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. బ్రోకరేజీ సర్వీసులు, లావాదేవీలు, ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ /అసెట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో మంచి పనితీరు నమోదు చేసినట్లు చెప్పారు.
ఈ సంవత్సరం ఇప్పటిదాకా 800 మంది సిబ్బందిని నియమించామని, ఈ ఏడాది చివరి నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 12,000కు చేరుకుంటుందని, వచ్చే ఏడాది చివరినాటికి తమ ఉద్యోగుల సంఖ్య 13,500 వరకు చేరుకుంటుందని చెప్పారు. ఇతర కంపెనీలతో పోలిస్తే వలసలు చాలా స్వల్పమన్నారు. కమర్షియల్ రంగం అంచనాలకు మించి పుంజుకుంటోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెరా, బినామీ లావాదేవీల చట్టం, జీఎస్టీ వంటి కీలక సంస్కరణలు రియల్ ఎస్టేట్పై సానుకూల ప్రభావం చూపుతున్నాయన్నారు.