న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి నెలలో రైతులకు ఆదాయ మద్దతు పథకం లేదా పీఎం కిసాన్ యోజనను ప్రకటించినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తాయి. బీజేపీ రెండోసారి విజయం సాధించినప్పుడు, వారి గెలుపులో పీఎం కిసాన్ యోజన పాత్ర కూడా ఉందని అందరూ భావించారు. తిరిగి అధికారాన్ని చేపట్టాక మోడీ ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని రైతులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ ఈ పథకం కిందకు 14 నుంచి 15 కోట్ల మంది రైతులు వస్తారని అంచనా వేశారు. వారికి ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం ఇస్తారు. మూడు విడతల్లో.. ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

పీఎం-కిసాన్ యోజన తడపడుతోందా?
అయితే పీఎం కిసాన్ యోజన స్కీం తడబడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ మినిస్ట్రీ అధికారిక పోర్టల్ ప్రకారం జూలై 22వ తేదీ వరకు కేవలం 5.6 కోట్ల మంది రైతులు మాత్రమే వ్యాలిడేట్ అయ్యారు. అంటే అర్హత కలిగిన రైతుల్లో ఇది కేవలం 37 శాతం మాత్రమే. అంతకుముందు, మొదటి విడతలో అర్హతగల రైతుల్లో 27% (4.15 కోట్లు) మందికి మాత్రమే రూ.2,000 జమ చేశారు. మొదటి విడతలో పంపిణీ చేసిన మొత్తం రూ.8,290.61 కోట్లు అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూలై 19న రాజ్యసభలో వెల్లడించారు.

రెండు విడతల్లో ఎంత ఇచ్చారంటే..
రెండవ విడత (రూ.2,000 చొప్పున) పంపిణీ కొనసాగుతోంది. దాదాపు రూ.6,355.86 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. అంటే అర్హత కలిగిన రైతులలో 21% మందికి మాత్రమే జమ చేయబడింది. మొదటి విడతలో పొందిన వారిలో కూడా కొందరికి రాలేదు. ప్రతి విడతలోను ఆధార్, బ్యాంకు ఖాతాలు వంటి ధృవీకరించుకునే సమస్య ఎదురు కావడం సరికాదు. మొదటిసారి జమ చేసినప్పుడే అన్నింటిని వెరిఫై చేసి, క్లియర్ చేసి ఉండాల్సిందని అంటున్నారు. తొలి విడత కోసం రూ.20,000 కోట్లు కేటాయించారు. కానీ రెండు విడతల్లోను కలిపి రూ.14,647 కోట్లు రైతులకు అందాయి.

రూ.లక్ష కోట్లకు పైగా..
2018-19లో పీఎం కిసాన్ స్కీం కోసం రూ.20,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2019-20 ఏడాదిలో రూ.87,218 కోట్లు అంచనా వేసింది. మొత్తం రూ.1,07,218 కోట్లు. కానీ రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అయింది రూ.14,647 కోట్లు. పలు రాష్ట్రాలు పీఎం కిసాన్ యోజనకు దూరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ స్కీం తమకు వద్దని తెలిపింది. బీహార్ వంటి రాష్ట్రాల్లో అర్హత కలిగిన రైతుల జాబితాను ఇంకా పూర్తి చేయలేదు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువమంది రైతుల జాబితా వ్యాలిడేట్ అయింది. తొలి స్థానంలో యూపీ ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications