కోడి గుడ్ల ధరలు మళ్ళీ పెరిగాయి. సామాన్యుడి ఫేవరేట్ నాన్ వెజ్ ఐటెం ప్రియం ఐంది. రెండు నెలలుగా రూ 4 స్థాయిలో అందుబాటులో ఉన్న ధరలు మళ్ళీ అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో రిటైల్ గుడ్డు ధర రూ 5.50 నుంచి రూ 6 పలుకుతోంది. వాతావరం చల్లబడటం తో పాటు ఉత్తరాది నుంచి డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం గుడ్ల ధరలపై పడిందని పౌల్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సహజంగా ఎండాకాలంలో కోడి గుడ్ల కు డిమాండ్ తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం అసాధారంగా తగ్గి పోతుంది. ఎండా కాలంలో గుడ్లను వినియోగించడం వాళ్ళ ఒంట్లో వేడి చేస్తుందని వారు నమ్ముతారు. అందుకే, ఒక్క సరిగా కోడిగుడ్లను డిమాండ్ పడిపోయి, ధరలు కూడా తగ్గుతాయని పౌల్ట్రీ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఫారం గాటు ధర తక్కువే...
నిజానికి ఫారం గేటు వద్ద కోడి గుడ్డు హైదరాబాద్ లో రూ 3.95 లభిస్తుండగా... హోల్సేల్ వ్యాపారాలు దానిని ఒక్కో గుడ్డుకు రూ 4.55 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక కిరానా షాపులు, చికెన్ సెంటర్లు, ఇతరత్రా చిన్న షాపుల్లో కోడి గుడ్డును ఒక్కోటి రూ 5.50 నుంచి రూ 6 చొప్పున అమ్ముతున్నారు. వేసవి కాలంలో కోళ్ల మరణాలు అధికంగా ఉండంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే ఉన్న కోళ్లు సైతం తక్కువ దాణా తీసుకొని, ఎక్కువ నీటిని తీసుకొంటాయి. దీంతో కోడి గుడ్ల ఉతపట్టి ప్రభావితం అవుతుంది. అయితే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కోడి గుడ్ల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని పౌల్ట్రీ రైతులు వెల్లడిస్తున్నారు.

అధిక వినియోగం....
జూన్ నెల నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచు కోవటం తో ఒక్క సరిగా కోడిగుడ్లను డిమాండ్ పెరుగుతుందని పౌల్ట్రీ అసోసియేషన్ వర్గాలు పేర్కొంటున్నారు. సహజంగానే ఈ సీజన్లో లంచ్ బాక్స్ లోకి ఎగ్ కర్రీ, ఉడికించిన కోడిగుడ్లను వాడతారని వివరణ ఇచ్చారు.

దేశం లో మూడో వంతు ఇక్కడే....
మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యో కోడిగుడ్లలో మూడో వంతు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతాయి. రోజుకు సగటున 25 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా... అదే మోతాదులో వినియోగం కూడా ఉంటోంది. అంటే... దేశంలో రోజులు దాదాపు 25 కోట్ల కోడి గుడ్లు హాం ఫట్ అవుతున్నాయన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లను సగం వరకు ఇక్కడే వినియోగిస్తుండగా... మిగితా సగం కోడిగుడ్లు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు మన వద్ద నుంచి అధికంగా కోడిగుడ్లు ఎగుమతి అవుతాయి.

పెరుగుతున్న దాణా ఖర్చులు...
పౌల్ట్రీ రంగంలో దాణా ఖర్చులు అధికం అవుతున్నాయి. మొక్క జూన్న, సోయాబీన్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం తో ఆ ప్రభావం కోడిగుడ్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగేందుకు కారణం అవుతోంది. అందుకే, మార్కెట్లో కోడిగుడ్ల ధరలు మెరుగ్గా ఉన్నప్పటికీ... పౌల్ట్రీ రైతులకు దక్కేది మాత్రం అంతంతే నాని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ధరలను స్థిరీకరించాలని వారు కోరుకొంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications