న్యూఢిల్లీ:భారత్లో ప్రతిష్టాత్మకంగా ఫాక్స్కాన్ సంస్థ ప్రారంభించిన ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ నుంచి తయారు అయిన ఐఫోన్లు వచ్చేనెలలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సమాచారం. భారత్లోనే తయారు కావడంతో ఈ ఐఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మరికొన్ని వాటికి అనుమతులు రావాల్సి ఉందని.. అయితే భారత్లో తయారైన ఐఫోన్-ఎక్స్ ఆర్ మరియు ఐఫోన్ -ఎక్స్ ఎస్ వచ్చే నెల ఆగష్టులో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయమై యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫాక్స్కాన్ కూడా తమ ఉత్పత్తులపై స్పందించేందుకు నిరాకరించింది. భారత్లో స్థానికంగా తయారు అయ్యాయి కాబట్టి వీటిపై అధిక స్థాయిలో పన్నులు ఇతరత్ర ట్యాక్సులు ఉండవు. యాపిల్ ఐఫోన్లను కొన్ని లక్షల మంది భారతీయులు వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనా సంస్థ వన్ ప్లస్ నుంచి అధిక పోటీని ఎదుర్కొంటోంది.

ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలోని క్యూపర్టినో సంస్థ బెంగళూరులోని యూనిట్లో తక్కువ ధర ఐఫోన్లు ఎస్ఈ, 6ఎస్ 7 మోడల్స్ను తయారు చేస్తోంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో స్మార్ట్ ఫోన్ తయారీకి కేంద్రంగా తయారు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని ప్రోత్సహకాలు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడంతోనే భారత్లో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు శాంసంగ్, వన్ ప్లస్లు ముందుకొచ్చాయి. వారి యూనిట్లను కూడా పెంచుకుంటూ పోయాయి.
చైనా అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దం కారణంగా యాపిల్ సంస్థ భారత్లో తమ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ల సేల్స్ను కూడా తగ్గించింది ఆ సంస్థ. ఇక భారత్లో తయారైన ఐఫోన్ 6ఎస్ 7 మోడళ్లను యూరోప్, హాంగ్కాంగ్లకు ఎగుమతి చేస్తోంది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications