న్యూఢిల్లీ: సూపర్ రిచ్పై ఎక్కువ ట్యాక్స్ విధింపు, పెట్రోల్, డీజిల్ పైన సెస్ కారణంగా ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.30,000 కోట్ల అదనపు ఆదాయం రానుందని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వీటితో పాటు బంగారం వంటి విలువైన మెటల్స్పై కస్టమ్స్ డ్యూటీ కారణంగా కూడా ఖజానాకు అదనపు ధనం రానుందన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలపై కార్పోరేట్ ట్యాక్స్ 25 శాతంగా ఉండగా, ఇక నుంచి రూ.400 కోట్ల ఆదాయం దాటిన కంపెనీలపై ఉండనుంది. దీంతో ప్రభుత్వానికి నష్టం కలగనుంది.

ఎక్కడి నుంచి ఎంత రాబడి అంటే
రూ.30,000 కోట్ల రాబటిలో రూ.22,000 కోట్లు పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్ ద్వారా లభించనుంది. వార్షిక ఆదాయం రూ.2 నుంచి 5 కోట్లు, అంత కంటే ఎక్కువ ఉన్న సంపన్నులపై ఆదాయ పన్ను రేటు పెంపు ద్వారా ఏటా రూ.12,000 కోట్ల నుంచి రూ.13,000 కోట్లు, బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకం పెంపు ద్వారా మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా.

లాభం.. నష్టం
రూ.2-5 కోట్ల ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకు పైగా ఆదాయం కలిగిన వారిపై పన్ను 15 శాతం నుంచి 37 శాతానికి పెంచారు. అలాగే బంగారం వంటి మెటల్స్ పైన కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీలపై ఆదాయ పన్ను రేటును 25 శాతంగా నిర్ణయించారు. దీంతో కార్పొరేట్ టాక్స్ రాబడుల్లో రూ.4,000 కోట్ల వరకు కోత పడనుందని అంచనా. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు రానున్నాయి.

విదేశీ బాండ్స్ ద్వారా నిధుల సేకరణ
మరోవైపు, విదేశీ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో నిధులు సేకరించేందుకు కేంద్ర సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నాటికి విదేశాల్లో సావరిన్ బాండ్స్ జారీ చేయడం ద్వారా భారీస్థాయిలో నిధులను సమీకరించాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. విదేశీ మార్కెట్లలో విదేశీ కరెన్సీ రూపంలో జారీచేయనున్న బాండ్స్ ద్వారా అధిక మొత్తంలో నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతమొత్తంలో నిధుల సేకరించేదానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఇందుకు సంబంధించి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. విదేశాల్లో నిధుల సేకరణకు సంబంధించి త్వరలో కేంద్రం ప్రత్యేక సలహాదారుడిని నియమించబోతుందన్నారు. మన అవసరాలకు విదేశాల్లో గరిష్టస్థాయిలో నిధులను సేకరించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఫారెన్ కరెన్సీ రూపంలో బాండ్స్ జారీ చేసి, సులభంగా నిధుల సేకరించవచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి రూ.4.48 లక్షల కోట్ల నిధులను సేకరించాలని కేంద్రం భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications