వాషింగ్టన్: G20 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మధ్య చర్చల అనంతరం ట్రేడ్ వార్ తాత్కాలికంగా ముగిసింది. అయితే తాజాగా, ట్రంప్ ఓ మెలిక పెట్టారు. చైనాతో ఒప్పందం తమకు అనుకూలంగా ఉండాలని ప్రకటించారు. అమెరికాకు లాభం ఉంటేనే బీజింగ్తో ఒప్పందం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు.
చైనా - అమెరికా వాణిజ్య చర్చలు మే నెలలో నిలిచిపోయాయి. జీ20 సమ్మిట్ నేపథ్యంలో ఇవి తిరిగి ప్రారంభమయ్యాయని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు ఆర్థికంగా సూపర్ పవర్ కలిగినవని, అయితే ఈ చర్చల్లో తమకు లాభం ఉండాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఫోన్ ద్వారా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అలాగే సమావేశాలు జరుగుతున్నాయన్నారు. తాను, జీ జిన్పింగ్ భేటీకి ముందే చర్చలు ప్రారంభమయ్యాయన్నారు.

వాణిజ్యం కారణంగా చాలాకాలంగా చైనానే ప్రయోజనం పొందుతోందని, కాబట్టి ఈ చర్చల ఫలితాలు అమెరికా కంటే బీజింగ్కే ఎక్కువ లబ్ధి చేకూరుస్తాయని ట్రంప్ అన్నారు. చర్చలు మాత్రం కచ్చితంగా అమెరికాకు అనుకూలంగా ఉండాలన్నారు. ఇంతకాలం వాణిజ్య పరంగా చైనా చాలా లబ్ధి పొందిందని, కాబట్టి ఈసారి 50-50 డీల్కు అంగీకరించేది అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కాబట్టి వాషింగ్టన్కు కాస్త ప్రయోజనకారిగా ఉండాలన్నారు.
చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు వాషింగ్టన్కు ప్రయోజనకారిగా కూడా ఉంటాయని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అమెరికా - చైనా వాణిజ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ పుంజుకుంటున్నాయి. జీ20 సమ్మిట్ అనంతరం చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ హువావేపై ట్రంప్ ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications