న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్టియం మరియు ఆదిగ్రూప్, ఎన్సిఎల్టి ప్రక్రియ ద్వారా 75 శాతం వాటాను వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) కు చెందిన ముంబై బెంచ్ జూన్ 20 న 26 మంది రుణదాతల తరఫున ఎస్బిఐ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను విచారణకు అంగీకరించింది. దీంతో దివాలా తీసిన మొదటి దేశీయ విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ అవతరించింది.
ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ సంస్థ రూ.8500 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా.. మరో 25 వేల కోట్ల రూపాయలు అరియర్స్ రూపంలో ఆ సంస్థ వెండర్స్కు ఇతర సిబ్బందికి చెల్లించాల్సి ఉంది. అయితే జెట్ ఎయిర్వేస్ సంస్థను తిరిగి దక్కించుకునేందుకు ఆదిగ్రూప్ మరియు ఉద్యోగుల కన్సార్టియం ముందుకు రావడం శుభపరిణామం. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఒక ఎయిర్లైన్ సంస్థను ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కాపాడుకోవడం విమానాయాన చరిత్రలోనే ఇది తొలిసారి. అంటే ప్రతి ఉద్యోగి జెట్ ఎయిర్లైన్స్ సంస్థ ఓనరే అన్నమాట.

ఇక జెట్ ఎయిర్వేస్ సంస్థ ఉద్యోగులు ఆ సంస్థను టేకోవర్ చేసే ప్రయత్నం చేస్తే...ప్రధాని కల అయిన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నిజం చేసినట్లు అవుతుందని ఉద్యోగులు ఆదిగ్రూప్ కన్సార్టియం చెప్పింది. జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నం హర్షించదగ్గ విషయం అని బోయింగ్ 777 కమాండర్ సీనియర్ పైలట్ కెప్టెన్ అశ్వని త్యాగి తెలిపారు. ఈయన పైలట్ సంక్షేమ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్లో 18 ఏళ్ల పాటు పనిచేసిన అశ్వని త్యాగి... ఈ సంస్థలోని సిబ్బంది తన కుటుంబంతో సమానమని అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications