న్యూఢిల్లీ: గార్మెంట్స్ దుకాణదారులకు జీఎస్టీ ఊరట లభించనుందా? అంటే అవుననే అంటున్నారు. అయితే అన్నింటి పైన కాకుండా రూ.2,000 ధర లోపు ఉన్న దుస్తుల పైన ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా, 5 శాతం జీఎస్టీ శ్లాబ్లోకి తీసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసారు. వారి విజ్ఞప్తిని ఆమె అంగీకరిస్తే జీఎస్టీ తగ్గే అవకాశముంది.
రూ.1,000 దుస్తుల పైన 5 శాతంగా ఉన్న జీఎస్టీని రూ.2,000కు పెంచాలని RAI కోరిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు వెయ్యి రూపాయలకు పైన విలువ కలిగిన దుస్తులు, అప్పారెల్స్ పైన 12 శాతం జీఎస్టీ ఉంది. కేంద్ర బడ్జెట్లో దీనిని ప్రస్తావించనప్పటికీ, కేంద్ర ఆర్థికమంత్రి లేదా ప్రభుత్వం తమ ఉద్దేశ్యాన్ని తెలియజేయవచ్చునని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సెల్, ఫిట్మెంట్ కమిటీ సమీక్ష కోసం పరిగణలోకి తీసుకోవచ్చునని అంటున్నారు.

అదే విధంగా, రిటైలర్స్కు క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్ చవక, సులభతరంగా ఉండేలా చేయాలని RAI కోరింది. ఇలా చేయడం ద్వారా డిజిటలైజేషన్కు మరింత ఊతమిచ్చినట్లుగా అవుతుందని తెలిపారు.
కాగా, ఇటీవల 35వ జీఎస్టీ మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దృవీకరణ పత్రంగా ఆధార్ తీసుకోవటం , యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితి పొడిగింపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువరించింది. యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగింపించింది.
జీఎస్టీ రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదలాయించకుండా కంపెనీలు లబ్ధి పొందిన మొత్తంలో 10 శాతం వరకు జరిమానాను విధించేందుకు ఆమోదం తెలిపిందన్నారు.మరోవైపు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు తేదీని ఈ ఏడాది ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాక ఉత్పత్తుల రవాణా కోసం ఈ-వే బిల్లులు సృష్టించి వరుసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారు కూడా తమ రిటర్నులను ఆగస్టు 21 వరకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?



Click it and Unblock the Notifications