For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూయార్క్ వేలంలో రూ.కోట్లు పలికిన గోల్కొండ వజ్రం, శ్రీరాముడి పెండెంట్, బరోడా రాణి బ్రేస్లెట్

|

క్రిస్టీ సంస్థ వేలంలో గోల్గొండ వజ్రం ఆర్కాట్ II రూ.23.5 కోట్లు పలికింది. ఆర్కాట్ రాజుకు చెందిన ఈ వజ్రంతో పాటు హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుల ఆభరణాలను కూడా ఈ సంస్థ వేలం వేసింది. ఈ ఆభరణాలకు కళ్లు చెదిరే ధరలు పలికాయి. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో పలు ఆభరణాలు వేలం వేసింది. దీంతో రూ.70 కోట్ల వరకు రాబట్టింది.

గుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే నగరంలో అద్దె ఇళ్లుగుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే నగరంలో అద్దె ఇళ్లు

రూ.23.5 కోట్లు పలికిన ఆర్కాట్ కింగ్ వజ్రం

రూ.23.5 కోట్లు పలికిన ఆర్కాట్ కింగ్ వజ్రం

ఇందులో ఆర్కాట్ II వజ్రమే రూ.23.5 కోట్లు (3,375,00 డాలర్లు) రాబట్టింది. ఇది ఒకప్పుడు ఆర్కాట్ నవాబు వద్ద ఉండింది. నిజాంకు చెందిన మరో వజ్రాల నెక్లెస్ రూ.17 కోట్లు, 33 వజ్రాలు ఉన్న మరో నెక్లెస్ రూ.10.5 కోట్లు పలికింది. ఆర్కాట్ II వజ్రాన్ని యజమానుల్లో గ్రేట్ బ్రిటన్ జార్జ్ III సతీమణి క్వీన్ చార్లోట్ కూడా ఉన్నారు. 17 కేరట్ల ఆర్కాట్ డైమండ్ తొలుత నవాబుల వద్ద ఉంది. ఆ తర్వాత ఇది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ వద్దకు చేరింది.

బరోడా మహారాణి బ్రేస్‌లెట్ ధర రూ.11.4 కోట్లు

బరోడా మహారాణి బ్రేస్‌లెట్ ధర రూ.11.4 కోట్లు

బరోడా మహారాణి సీతాదేవి ధరించిన ఆభరణాలు కూడా క్రిస్టీ సంస్థ వేసిన వేలంలో అధిక ధర పలికాయి. పచ్చపూసలు, వజ్రాలు, ప్లాటినమ్ పొదిగిన బరోడా మహారాణి బ్రేస్‌లెట్ రూ.11.4 కోట్లు పలికింది. 'మహారాజాస్ అండ్ ముఘల్స్ మాగ్నిఫికెన్స్' పేరుతో ఈ వేలాన్ని నిర్వహించింది క్రిస్టీ సంస్థ. ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆల్ థానీకి చెందిన 400 రాజవస్తువులను కూడా వేలం వేసింది.

రాముడు, సీత, హనుమంతుడు పెండెంట్ ధర రూ.5.12 కోట్లు

రాముడు, సీత, హనుమంతుడు పెండెంట్ ధర రూ.5.12 కోట్లు

జెమ్ సెట్ మోడల్ ప్యారట్‌ను కూడా ఈ సంస్థ వేలం వేసింది. ఇది రూ.7.21 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ IIకు చెందిన ఆభరణంతో ఈ వేలం ప్రారంభమైంది. ఈ మహారాజు ఇంగ్లాండ్‌లో చదువుకున్నారు. అతను తన సతీమణితో కలిసి అబ్రాడ్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఇతనికి చెందిన రాయల్ నెక్లెస్ ధర రూ.1.44 కోట్లు ($206,250) పలికింది. దీని ధర రూ.42 లక్షలు పలుకుతుందని భావిస్తే దాదాపు మూడున్నర రెట్లు పలకడం గమనార్హం. జైపూర్ రాజమాతా గాయత్రి దేవి డైమండ్ రూ.4.45 కోట్లు పలికింది. అలాగే, శ్రీరామచంద్రుడు, సీతాదేవీ, హనుమంతుడు కలిగిన పెండెంట్ రూ.5.12 కోట్లు పలకడం గమనార్హం. ముంబైకి చెందిన జెవెల్లరీ హౌస్ భగత్ రూపొందించిన డైమండ్ నెక్లెస్, మరో వజ్రాభరణం వరుసగా రూ.11.8 కోట్లు, రూ.1.5 కోట్లు పలికింది.

English summary

న్యూయార్క్ వేలంలో రూ.కోట్లు పలికిన గోల్కొండ వజ్రం, శ్రీరాముడి పెండెంట్, బరోడా రాణి బ్రేస్లెట్ | 17 carat Golconda diamond Arcot II sold for Rs.23.5 crore

A Golconda diamond 'Arcot II' once owned by Queen Charlotte, consort of King of Great Britain George III, a diamond necklace of the Nizams of Hyderabad, and a jewel-studded bracelet by Maharani Sita Devi of Baroda, were among the sought after Indian jewels that fetched high prices at a Christie's auction here.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X