న్యూఢిల్లీ: మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ జీడీపీపై చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సెల్ (EAC) కొట్టిపారేసింది. 2012 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 ఆర్థిక సంవత్సరం వరకు జీడీపీని ఎక్కువ చేసి చూపించారన్న ఆయన వ్యాఖ్యలు సరికావని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది.
2011-12 నుంచి 2016-17 మధ్య కాలంలో జీడీపీ గణాంకాలను 2.5 శాతం ఎక్కువ చేసి చూపారని, జీడీపీ గణాంకాల లెక్కింపు పద్ధతిలో మార్పు వల్లే ఇలా జరిగిందని ఆయన ఇటీవల ఓ చెప్పారు. ఇవి చర్చనీయాశంగా మారాయి. దీనిపై ప్రధాని ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సెల్ స్పందించింది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి (CMIE) అనే ప్రయివేటు ఏజెన్సీ అందించిన సమాచారాన్ని ఆయన నమ్ముతున్నారని, ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) సమాచారాన్ని నమ్మకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. భారత్ జీడీపీ గణాంకాల లెక్కింపు అంతర్జాతీయ స్థాయిలో ఉందని పేర్కొంది.
కాగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, అలాగే మోడీ ప్రభుత్వంలో ఒక్కోసారి జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ )ను భారీగా పెంచి చూపినట్లు ఆరోపించారు. 4.5 శాతంగా ఉన్న జీడీపీని 7 శాతంగా చూపించారని తెలిపారు. ఈ మేరకు 'ఇండియాస్ జీడీపీ మిస్ ఎస్టిమేషన్: లైక్లీ హుడ్, మ్యాగ్నిట్యూడ్, మెకానిజం, ఇంప్లికేషన్స్' అనే పేరుతో వెలువరించిన పరిశోధనా పత్రం వచ్చింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ, మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల్ని ఎక్కువగా చూపించారని ఈ మాజీ ప్రధాన ఆర్థికసలహాదారు(అరవింద్ సుబ్రహ్మణ్యం) పేర్కొన్నారు. 2011-12, 2016-17 మధ్యకాలంలో జీడీపీని ఎక్కువ చేసి చూపించారని తెలిపారు. జీడీపీ లెక్కింపు పద్ధతుల్లో ఉన్న తేడాల వల్లే అసలు కంటే 2.5 శాతం ఎక్కువగా అంచనా వేశారన్నారు. 2011, 2016 మధ్యకాలంలో భారత వృద్ధి సరాసరి 4.5 శాతంగా ఉందని, కానీ అధికారిక అంచనా మాత్రం 6.9 శాతంగా ఉందని చెప్పారు.
2011 తర్వాత జీడీపీ లెక్కింపు కోసం తీసుకు వచ్చిన కొత్త పద్ధతులే అధిక అంచనాలకు కారణమని, దీనికి సంబంధించి పలు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. భారత్ వేగవంతమైన వృద్ధి కోసం వాస్తవిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. వెహికిల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, క్రెడిట్ గ్రోత్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వంటి 17 అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications