ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ షేర్లు కుదేలవుతున్నాయి. మంగళవారం భారీగా పతనమయ్యాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే 29 శాతం కుంగిపోయాయి. ఒక దశలో లైఫ్ టైమ్ కనిష్టం రూ.28.60 వద్దకు చేరుకుంది. ఈ రోజు (జూన్ 19) ఎన్సీఎల్టీలో విచారణ నుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా కంపెనీ షేర్లను విక్రయిస్తున్నారు.
జెట్ ఎయిర్వేస్పై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్కు వెళ్లనున్న నేపథ్యంలో మంగళవారం కూడా స్టాక్ను కుప్పకూల్చాయి. కంపెనీని దివాలా గుర్తించి ముందుకు సాగేందుకు అనుమతినివ్వాంటూ ప్రధాన లెండర్ ఎస్బీఐ... ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీంతో ఈ స్టాక్ బుధవారం ఏకంగా 50 శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో రూ.32 వరకు దిగొచ్చిన స్టాక్ కాస్త కోలుకుని రూ.40.50 దగ్గర క్లోజైంది. ఒక్కరోజులో 40 శాతం నష్టంతో క్లోజైంది.

బుధవారం కూడా పరిస్థితిలో మార్పు లేదు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో రూ.31.35 వద్ద ట్రేడ్ అయింది. బీఎస్ఈలో 28.18 శాతం నష్టంతో ఆల్ టైమ్ కనిష్టం రూ.29.05 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈలో 29.38 శాతం తగ్గి ఆల్ టైమ్ కనిష్టం రూ.28.60 వద్ద ట్రేడ్ అయింది. జెట్ ఎయిర్వేస్ షేర్లు వరుసగా 13 రోజులు పతనమయ్యాయి. గత వారంలోనే జెట్ ఎయిర్వేస్ షేర్లు 74 శాతం కుప్పకూలాయి. మొత్తంగా 81 శాతం నష్టపోయాయి. దీంతో జూన్ 28వ తేదీ నుంచి కంపెనీ షేర్లను ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలోకి చేర్చారు.
జెట్ ఎయిర్వేస్ షేర్ ఈ ఏడాది ప్రారంభంలో రూ.250 దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చింది. అప్పటో సంస్థ మార్కెట్ క్యాప్ సుమారు రూ.10 వేల కోట్ల వరకూ ఉండేది. అలాంటిది ఇప్పుడు సదరు షేర్ ధర రూ.30కి అటు ఇటుగా ఉంది. ఏడాదిలో 85 శాతం వరకూ స్టాక్ ధర కుప్పకూలిపోయింది. బ్యాంకుల విషయానికి వస్తే.. జెట్ ఎయిర్ సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కలిపి సుమారు రూ.11260 కోట్లు బకాయి పడింది. వాటిల్లో సుమారు రూ.7251 కోట్ల వరకూ మన దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎస్బీఐకే సుమారు రూ.1958 కోట్ల వరకూ చెల్లించాల్సిన ఉంది జెట్ ఎయిర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.1746 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్కు రూ.545 కోట్లు, యెస్ బ్యాంక్కు రూ.869 కోట్లు, ఐడిబిఐకి రూ.752 కోట్లు, కెనెరా బ్యాంక్కు రూ.718 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.266 కోట్లు చెల్లించాల్సి ఉంది జెట్ ఎయిర్.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications