జెట్ వాటాల విక్రయంలో జాప్యం .. స్టాక్ ఎక్స్చేంజ్ ఆంక్షలతో కుప్ప కూలిన షేర్ ... ఎందుకంటే
జెట్ ఎయిర్ వేస్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచిలా ఉన్న జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడటానికి 'జెట్' వాటాలవిక్రయానికి నిర్ణయం తీసుకుంది. అయితే విక్రయంలో జాప్యం జరుగుతుంది. అంతే కాదు దివాలా కేసు 20వ తేదీకి వాయిదా పడింది.
స్టాక్ ఎక్స్ఛేంజీల ఆంక్షలతో కుప్పకూలిన జెట్ ఎయిర్..10 రోజుల్లో 45.60 శాతం నష్టం
స్టాక్ ఎక్స్ఛేంజీల ఆంక్షలతో జెట్ ఎయిర్ వేస్ షేర్ కుప్పకూలింది . 10 రోజుల్లో 45.60 శాతం నష్టంతో ట్రేడ్ అవుతుంది. మూతపడిన జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రోజురోజుకు మరింత సంక్లిష్ఠంగా మారుతోంది. జెట్లో వాటాలను విక్రయించేందుకు ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇద్దరు ఆపరేషనల్ క్రెడిటార్లు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక ఈ కేసును విచారించిన ఎన్సీఎల్టీ బెంచ్ ఈ కేసును ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.
ఏటీఎంలు గోడలకు బిగించండి .. నగదు లేకుంటే బ్యాంకులకు జరిమానా వెయ్యండి .. ఆర్బీఐ నిర్ణయం
వాటాల విక్రయంలో మరింత జాప్యం .. బ్యాంకు రుణాల చెల్లింపు విషయంలో ఓ నిర్ణయానికి రాకపోవటమే కారణం
దీంతో వాటాల విక్రయం మరింత జాప్యం అవుతుంది. మరోవైపు జెట్ను కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ సహా లండన్కు చెందిన ఆదిగ్రో గ్రూప్ కూడా ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ సంస్థలు ఆఫర్ చేసిన మొత్తం బ్యాంకుల కన్సార్షియానికి నచ్చకపోవటంతో పరిస్థితి నానాటికి దారుణంగా మారుతోంది. పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలుండటంతో జూన్ 28 నుంచి జెట్ ఎయిర్వేస్ షేరుపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించాయి. రోలింగ్ సెగ్మెంట్ నుంచి ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్కు జెట్ షేర్లను మారుస్తున్నట్లు ఈ నెల 12న ఎన్ఎస్ఈ ప్రకటించింది.ఈ నెల 28 నుంచి షేరు ట్రేడింగ్పై ఆంక్షలు విధించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల్లో జెట్ షేరు 30 శాతానికి పైగా నష్టపోయింది.
బ్యాంకులు రుణ మొత్తాలను భారీగా వదులుకొనేందుకు సిద్ధంగా లేవు అందుకే విక్రయం జాప్యం
జెట్ ఎయిర్వేస్ ను గాడిలో పెట్టేందుకు ఎతిహాద్ ఎయిర్వేస్, హిందూజా గ్రూప్.. రుణదాతల కన్సార్షియంతో చర్చలు సాగిస్తూనే ఉన్నాయని తెలుస్తుంది . అయితే రుణాల చెల్లింపు విషయంలో ఇవి ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవటంతో ఈ విక్రయం మరికొంత సమయం పట్టే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి. మరోవైపు జెట్ను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్కు చెందిన ఆదిగ్రో ఏవియేషన్ కూడా ఇప్పటికే ప్రకటించింది. గతంలో జెట్లో 24.9 శాతం వాటాల కొనుగోలుకు ఆదిగ్రో ఏవియేషన్ రూ.2,5,00 కోట్లు ఆఫర్ చేసింది. బ్యాంకులు తమ రుణాల్లో 70-75 శాతం వదులుకుంటే తాము డీల్కు సిద్ధంగా ఉన్నట్లు ఆదిగ్రో తెలిపింది. అయితే రుణ మొత్తాలను భారీగా వదులుకునేందుకు బ్యాంకులు ఏమాత్రం సుముఖంగా లేవు. అందుకే ‘జెట్' వాటాల విక్రయం మరింత జాప్యం అయ్యే అవకాశం వుంది.