కోల్కతా: రిలయన్స్ జియో సత్తా చాటింది. రెవెన్యూ మార్కెట్ షేర్ (RMS)లో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో వొడాఫోన్ - ఐడియా నిలవగా, మూడో స్థానంలో భారతీ ఎయిర్టెల్ నిలిచింది. వరుసగా పది క్వార్టర్స్లో వొడాఫోన్ - ఐడియా క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు RMS పెరగడంతో పాటు మొదటి స్థానంలో నిలిచింది.

ఎయిర్టెల్కు జియో భారీ దెబ్బ
మార్చి క్వార్టర్లో రిలయన్స్ జియో 182 బేసిక్ పాయింట్స్ పెరిగి RMS షేర్లో 31.7 శాతం వాటాను కలిగి ఉంది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ 285 బేసిక్ పాయింట్లు తగ్గి 27.3 శాతంగా (RMS) ఉంది. వొడాఫోన్ - ఐడియా 57 బేసిక్ పాయింట్స్ పెరిగి 32.2 శాతం RMSతో ఉంది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేశారు.

దూసుకెళ్తున్న జియో
గత ఏడాది ఆగస్ట్ నెలలో వొడాఫోన్-ఐడియా విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఇవి విలీనం ఆధారంగానే RMS డేటాను ఇస్తున్నాయి. రిలయన్స్ జియో 21 సర్కిల్స్లలో భారీగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. 15 మార్కెట్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. A, B, C సర్కిల్స్లలో జియో మార్కెట్ లీడర్గా నిలిచింది. మెట్రో మార్కెట్లో వొడాఫోన్- ఐడియా అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ కీలకమైన కర్ణాటక (15 శాతం తగ్గుదల), తమిళనాడు (16 శాతం తగ్గుదల), ఢిల్లీ (33 శాతం తగ్గుదల), ఆంధ్రప్రదేశ్ (8 శాతం తగ్గుదల) భారీగా క్షీణించింది. RMSలో ఎయిర్టెల్ మూడో స్థానానికి పడిపోయింది.

ఐడీయా నెంబర్ వన్.. దరిదాపుల్లోనే జియో
క్వార్టర్ 3లో వొడాఫోన్ ఐడియా RMS 31.6 శాతం, రిలయన్స్ జియో 29.9 శాతం, ఎయిర్టెల్ 30.2 శాతంగా ఉంది. క్వార్టర్ 4లో ఎయిర్టెల్ భారీగా నష్టపోయింది. నాలుగో క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా 32.2 శాతం, రిలయన్స్ జియో 31.7 శాతం, ఎయిర్టెల్ 27.3 శాతానికి పడిపోయింది. భారతీ ఎయిర్టెల్ వరుస క్షీణతలతో 11.4 శాతం మేర తగ్గింది.

1 శాతం తగ్గిన టెలికం సెక్టార్ ఏజీఆర్
రిలయన్స్ జియో అడ్జస్టెజ్ గ్రాస్ రెవెన్యూ (AGR) 4 శాతం పెరిగి రూ.9,986 కోట్ల (NLD-నేషనల్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ రెవెన్యూ) వద్ద ఉండగా, వొడాఫోన్ ఐడియా AGR 0.3 శాతం పెరిగి 10,149 కోట్లుగా ఉంది. ఎయిర్టెల్ AGR రూ.8,608.2 కోట్లుగా ఉంది. మొత్తంగా టెలికం సెక్టార్ AGR(NLD రెవెన్యూ కలుపుకొని) నాలుగో క్వార్టర్లో 1 శాతం తగ్గి, రూ.31,518.2 కోట్లుగా ఉంది.

ఈ సర్కిల్స్లో ఐడియా ఏజీఆర్ను దాటేసిన జియో
ముంబై, తమిళనాడు, యూపీ-ఈస్ట్, ఆంధ్రప్రదేశ్ తదితర సర్కిల్స్లలో వొడాఫోన్ ఐడియా AGR తగ్గింది. రిలయన్స్ జియో కారణంగా ఈ నష్టం జరిగింది. ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాలు క్రమంగా తమ మార్కెట్ను కోల్పోతుండగా జియో మార్కెట్ పెరుగుతోంది. ఓ వైపు రిలయన్స్ జియో ఫోర్త్ క్వార్టర్ నాటికి 27 మిలియన్ యూజర్లు పెరిగి 65 శాతానికి పెరిగింది. రూ.840 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు ఎయిర్టెల్ రూ.89.8 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.101 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. వొడాఫోన్ - ఐడియా పరిస్థితి కూడా అలాగే ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications