తమ దేశంలోని బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పలువురు భారతీయులకు స్విట్జర్లాండ్ షాకిచ్చింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల సమాచారాన్ని మన దేశంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం పంచుకుంటోంది. అయితే ఈ సమాచారం రహస్యంగానే ఉండాలంటే దానిని సమర్థించే వివరాలతో దరఖాస్తు పెట్టుకోవాలని ఖాతాదారులకు స్విస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా పలువురికి ఇచ్చింది.

11 మంది భారతీయులకు స్విస్ ప్రభుత్వం నోటీసులు
మార్చి నెల నుంచి కనీసం 25 మందికి నోటీసులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. మే 21వ తేదీన కనీసం 11 మందికి ఈ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో స్విస్ బ్యాంక్ ఖాతాదారుల పేర్లను సూక్ష్మరూపంలో పేర్కొంటూ వివరాలు కోరుతోంది. గెజిట్ నోటిఫికేషన్లో పూర్తి పేరుకు బదులు కేవలం ఇనిషియల్, జాతీయత, పుట్టిన తేదీలను మాత్రమే పేర్కొంది. వారిలో ఇద్దరు మినహా అందరి పేర్లను పూర్తిగా బహిరంగపరచలేదు. ఓ ఇద్దరికి మాత్రం పూర్తి పేర్లతో నోటిసులు జారీ చేసింది.

ఇద్దరికి పేర్లతో నోటీసులు
1949 మేలో జన్మించిన కృష్ణ భగవాన్ రాంచంద్, 1972 సెప్టెంబర్లో జన్మించిన కల్పేష్ హర్షద్ కినారివాలాకు పేర్లతో నోటీసులు వచ్చాయి. వారి గురించి అంకుమించి ఏ వివరాలు ఇవ్వలేదు. మిగిలిన వారి పేర్లను మాత్రం పొడి అక్షరాలతో పేర్కొంది. ఈ నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేదంటే ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్విస్ ప్రభుత్వం ఆ నోటీసుల్లో హెచ్చరించింది.

MLA సహా 11 మంది భారతీయులు వీరే..!
స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ నోటీసులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలు ప్రభుత్వానికి అందిస్తామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో స్పందించాలని పేర్కొంది. అప్పీల్ చేసుకునేందుకు ఇది ఆఖరి అవకాశమని చెప్పింది. కృష్ణ భగవాన్ రాంచంద్, కల్పేష్ హర్షద్లతో పాటు మరికొందరు భారతీయుల పేర్లు ఇలా పేర్కొంది.... Mrs A.S.B.K.(పుట్టిన తేదీ... నవంబర్ 24, 1944), Mr A.B.K.I.(పుట్టిన తేదీ... జూలై 9, 1944), Mrs P.A.S.(పుట్టిన తేదీ... నవంబర్ 2, 1983), Mrs R.A.S. (పుట్టిన తేదీ... నవంబర్ 22, 1973), Mr A.P.S.(పుట్టిన తేదీ... నవంబర్ 27, 1944), Mrs A.D.S. (పుట్టిన తేదీ... ఆగస్ట్ 14, 1949), Mr M.L.A.(పుట్టిన తేదీ... మే 20, 1935), Mr N.M.A.(పుట్టిన తేదీ... ఫిబ్రవరి 21, 1968) and Mr M.M.A. (జూన్ 27, 1973).

మోడీ సర్కార్ చర్యలు
దశాబ్దాలుగా నల్లధన కుబేరులకు స్విస్ బ్యాంకులు ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో స్విట్జర్లాండ్ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్ బ్యాంకుల ఇండియన్ క్లయింట్స్కు 25 మందికి నోటీసులు ఇచ్చింది. నల్లధనం వెలికితీసేందుకు మోడీ సర్కార్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. నల్లధనం వెలికితీతలో భాగంగా పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలైన దేశాలతో మోడీ ప్రభుత్వం రు సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకుంది. ఈ క్రమంలోనే స్విస్ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతోంది. అయితే తమ బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణార్థం ఖాతాదారుల సమ్మతితోనే ఈ సమాచార మార్పిడికి స్విస్ ప్రభుత్వం సిద్దపడుతోంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications