నాలుగో రోజు స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు: హైదరాబాద్-విజయవాడలో ఏంత అంటే?
పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 7 పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.76.01, డీజిల్ ధర రూ.72.47కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో స్వల్పంగా పెరిగాయి.
అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు పెరగడంతో రూ.75.76, డీజిల్పై 7 పైసలు పెరగడంతో రూ.71.82కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.75.41, డీజిల్ రూ.71.50గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.67, లీటర్ డీజిల్ ధర రు.66.64 గా ఉంది. నోయిడాలో పెట్రోల్ రూ.71.29, డీజిల్ రూ.65.71, గురుగావ్లో పెట్రోల్ రూ.71.81, డీజిల్ 65.79గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ రూ.73.73, డీజిల్ రూ.68.33, ముంబైలో పెట్రోల్ రూ.77.28, డీజిల్ రూ.69.75, చెన్నైలో పెట్రోల్ రూ.74.39, డీజిల్ రూ.70.45గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు పెరుగుతుండటంతో ఈ ధరలు పెరుగుతున్నాయి.